ఈ మధ్య వెబ్ సిరీస్ లను జనం అంత సీరియస్ గా పట్టించుకుంటున్నట్టు లేదు. కొత్త రిలీజులు ఉంటున్నా ఎక్స్ ట్రాడినరి రివ్యూలు, సోషల్ మీడియా టాక్స్ వస్తే తప్ప ఆడియన్స్ దృష్టిలో పడటం లేదు. అలాంటిదే మండల మర్డర్స్. మొన్న శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నాని ఆహా కళ్యాణం హీరోయిన్ వాణి కపూర్ ప్రధాన పాత్ర పోషించగా చాలా పెద్ద బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. గోపి పుత్రన్ – మనన్ రావత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ భాగస్వామి కావడంతో ఖర్చు పరంగా రాజీ లేకుండా ప్రొడక్షన్ చేయడం వల్ల మంచి క్వాలిటీ స్క్రీన్ మీద కనిపించింది.
స్టోరీ లైన్ ఆసక్తికరంగా ఉంటుంది. 1952 నుంచి 2025 మధ్యలో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో చూపిస్తారు. ఉత్తర్ ప్రదేశ్ లోని చరణ్ దాస్ అనే ఊరికి దగ్గరలో ఉన్న వరుణ అడవిలో ఒక మాంత్రికుల గుంపు ఉంటుంది. ఎవరైనా వచ్చి బొటన వేలిని సమర్పిస్తే ఎంత పెద్ద కోరిక అయినా తీర్చే సైతాన్ దైవం వాళ్ళ స్వంతం. హఠాత్తుగా చాలా దారుణమైన స్థితిలో కొందరి హత్యలు జరుగుతాయి. దీని ఇన్వెస్టిగేషన్ చేపట్టిన లేడీ సిబిఐ ఆఫీసర్ కు తోడుగా ఢిల్లీ నుంచి వచ్చిన సస్పెండ్ పోలీస్ కలిసి విస్తుపోయే నిజాలు తెలుసుకుంటారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకునే క్రమంలో దారుణమైన వాస్తవాలు బయట పడతాయి.
మూఢనమ్మకం, రాజకీయం, సామజిక పరిస్థితులు, జనాల అమాయకత్వం ఇలా అన్ని అంశాలను జోడించి మండల మర్డర్స్ ని ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందించారు. బోలేడన్ని పాత్రలు ఉన్నప్పటికీ ప్రతిదానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి వాటిని ట్విస్టులకు ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంది. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ లో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మలుపులు ఊహకందని విధంగా ఉంటాయి. హింస ఉన్నప్పటికీ మరీ జుగుప్సాకరంగా అనిపించదు. ఒకటి రెండు తప్ప పెద్ద అడల్ట్ సీన్స్ లేవు. తెలుగు డబ్బింగ్ ఉంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రధాన బలంగా సాగే మండల మర్డర్స్ ని ఈ జానర్ ఆడియన్స్ ట్రై చేయొచ్చు. నిరాశపరచదు.
This post was last modified on July 27, 2025 9:15 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…