పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవుతుంటే.. దానికి పోటీగా వేరే చిత్రాలను రిలీజ్ చేయడానికి భయపడతారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. తెలుగు నుంచి పవన్ సినిమాకు పోటీగా మరే చిత్రం విడుదల కాలేదు. దీంతో ఓ వారం పాటు ‘వీరమల్లు’దే రాజ్యం అనుకున్నారు. కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఊహించని పోటీ ఎదురైంది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ అనువాద చిత్రం ‘మహావతార నరసింహ’ ఇప్పుడు పవన్ సినిమాను సవాలు చేస్తోంది.
శుక్రవారం ఈ సినిమా రిలీజవుతుంటే జనం పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించలేదు. అసలే అనువాద చిత్రం. పైగా ఇందులో స్టార్లు లేరు. అందులోనూ యానిమేషన్ మూవీ. దీంతో అందరూ ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నట్లు కనిపించారు. కానీ రిలీజ్ రోజు సాయంత్రానికి కథ మారిపోయింది. ఇది మన కల్ట్ మూవీ ‘భక్త ప్రహ్లాద’ కథతో యానిమేషన్లో రూపొందిన సినిమా. ఈ కథతో మన వాళ్లకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. యానిమేషన్లో విజువల్ ఎఫెక్ట్స్ను అద్భుతంగా వాడుకుని కొన్ని ఎపిసోడ్లను కళ్లు చెదిరే రీతిలో రూపొందించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.
తొలి రోజు సాయంత్రం మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడ్డాయి. రెండో రోజు ఉదయం నుంచే మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. శనివారం సాయత్రం ఈ సినిమాకు అసాధారణమైన ఆక్యుపెన్సీలు కనిపించాయి. ఆదివారం పవన్ సినిమాను డామినేట్ చేసే స్థాయిలో ఈ సినిమాకు ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో బుక్ మై షోలో ‘హరిహర వీరమల్లు’కు లక్ష పైచిలుకు టికెట్లు అమ్ముడైతే.. ‘మహావతార నరసింహ’కు 2 లక్షలకు పైగానే టికెట్ల సేల్ జరగడం విశేషం.
తెలుగులోనే కాక.. కన్నడ, హిందీలోనూ ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. సినిమాలో పతాక సన్నివేశాలు చూసి జనం ఊగిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా వాటి గురించి పెద్ద చర్చ జరుగుతోంది. చూస్తుంటే సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని.. ఫుల్ రన్లో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందని అర్థమవుతోంది. ‘మహావతార నరసింహ’ను తెలుగు రాష్ట్రాల్లో అల్లు అరవింద్ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…