బాలీవుడ్లో ఒక సినిమాకు వేర్వేరు సంగీత దర్శకులు పాటలు అందించడం.. బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతల్ని కూడా ఇద్దరు పంచుకోవడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. కానీ దక్షిణాదిన ఈ ఒరవడి ఇంకా ఊపందుకోలేదు. పాటలైనా, నేపథ్య సంగీతమైనా ఒక్కరే చేయాలని కోరుకుంటారు. పాటలు ఒకరు, నేపథ్య సంగీతం ఒకరు చేయడం కొన్ని సినిమాల విషయంలో జరుగుతోంది. కానీ పెద్ద సంగీత దర్శకులు ఈ రెండు పనులూ తామే చేయాలనుకుంటారు.
గత ఏడాది ‘పుష్ప-2’కు సంబంధించి కొన్ని సీన్లకు బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతలను వేరే వాళ్లకు ఇస్తే దేవిశ్రీ ప్రసాద్ ఎంత హర్ట్ అయ్యాడో తెలిసిందే. ఇక వర్తమానంలోకి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’కు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఇందులో ఒక ఐటెం సాంగ్ను భీమ్స్ సిసిరోలియోతో చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ను ‘విశ్వంభర’ టీం అవమానించిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ స్పందించాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ను భీమ్స్తో చేయించడంలో ఎలాంటి వివాదం లేదని.. తాము కీరవాణిని అవమానించాం అనడం తప్పని అతను వివరణ ఇచ్చాడు. ఈ సినిమాకు ఈ పాట చేయాల్సిన సమయంలో కీరవాణి.. ‘హరిహర వీరమల్లు’ నేపథ్య సంగీతం పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారని అతను వెల్లడించాడు. ఈ పాటను వేరే సంగీత దర్శకుడితో చేయిద్దాం అని ఆయనే సలహా ఇచ్చినట్లు అతను తెలిపాడు.
అదేంటి సార్ అని అడిగితే.. ‘ఒక పాటను ఒకరు రాస్తే మరో పాటను ఇంకొకరు రాస్తారు. ఇదీ అంతే’ అని కీరవాణి బదులిచ్చినట్లు వశిష్ఠ వెల్లడించాడు. ‘బింబిసార’కు చిరంతన్ భట్తో కలిసి పని చేసిన విషయాన్ని కీరవాణి గుర్తు చేశారని.. భీమ్స్తో ఈ పాట చేయిద్దామని చిరంజీవికి కూడా కీరవాణినే చెప్పి ఒప్పించినట్లు వశిష్ఠ తెలిపాడు. సినిమా ఆలస్యం కాకూడదన్నదే కీరవాణి ఉద్దేశమని.. ఇందులో ఎలాంటి వివాదం లేదని వశిష్ఠ స్పష్టం చేశాడు.
This post was last modified on July 27, 2025 2:34 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…