రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కింగ్డమ్ జూలై 31 విడుదలకు రెడీ అవుతోంది. నిన్న తిరుపతిలో ఘనంగా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. చెప్పిన టైం కన్నా బాగా ఆలస్యంగా యూట్యూబ్ లోకి వచ్చిన కంటెంట్ కోసం అభిమానులు తెగ ఎదురు చూశారు. ది ఫ్యామిలీ స్టార్ తర్వాత ఏడాది పైగా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. అందులోనూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అయిదేళ్ళు ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డాడంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి కథ దాచే ప్రయత్నం చేయకుండా స్పష్టంగా రివీల్ చేశారు.
సూరి (విజయ్ దేవరకొండ) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక సీక్రెట్ మిషన్ కోసం తన ఉనికిని మార్చుకుని, కుటుంబాన్ని వదులుకుని శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది. ఎవరినైతే తాను పట్టుకోవాలనే లక్ష్యంతో వెళ్ళాడో, జైల్లో అతను కరుడు గట్టిన రాక్షస నాయకుడు శివ (సత్యదేవ్) స్వయానా తన అన్నయ్యని తెలుస్తుంది. అయితే ఈ నిజం బయటపెట్టకుండా తన పని మొదలుపెడతాడు సూరి. శివ అలా ఎందుకు మారాడు, అక్కడ రాక్షసుల్లాంటి మనుషులను కట్టడి చేసే ప్రయత్నంలో సూరి లీడర్ గా ఎలా మారాడు అనేది కింగ్డమ్ ప్రపంచంలో చూడాలి. ఇదంతా పీరియాడిక్ సెటప్ లో వెనుకటి కాలంలో జరుగుతుంది.
విజువల్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. కెజిఎఫ్, పుష్ప రేంజ్ మేకింగ్ తో గౌతమ్ తిన్ననూరి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎంటర్ టైన్మెంట్ లేకుండా ఎమోషన్, యాక్షన్ మీద దృష్టి పెట్టి విజయ్ దేవరకొండని లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ తో చూపించిన తీరు కొత్తగా ఉంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ షో కాకుండా ఈసారి పెర్ఫార్మన్స్ దక్కించుకుంది. సత్యదేవ్ స్పెషల్ ప్యాకేజ్ కాబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఎప్పటిలాగే మంచి ఎలివేషన్ ఇచ్చింది. స్టోరీ పరంగా ఇప్పటిదాకా ఉన్న సస్పెన్స్ వీగిపోయింది. థియేటర్లలో సూరి చూపించబోయే విశ్వరూపం ఎలా ఉండబోతోందో జూలై 31 తేలనుంది.
This post was last modified on July 27, 2025 9:03 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…