రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కింగ్డమ్ జూలై 31 విడుదలకు రెడీ అవుతోంది. నిన్న తిరుపతిలో ఘనంగా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. చెప్పిన టైం కన్నా బాగా ఆలస్యంగా యూట్యూబ్ లోకి వచ్చిన కంటెంట్ కోసం అభిమానులు తెగ ఎదురు చూశారు. ది ఫ్యామిలీ స్టార్ తర్వాత ఏడాది పైగా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. అందులోనూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అయిదేళ్ళు ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డాడంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి కథ దాచే ప్రయత్నం చేయకుండా స్పష్టంగా రివీల్ చేశారు.
సూరి (విజయ్ దేవరకొండ) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక సీక్రెట్ మిషన్ కోసం తన ఉనికిని మార్చుకుని, కుటుంబాన్ని వదులుకుని శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది. ఎవరినైతే తాను పట్టుకోవాలనే లక్ష్యంతో వెళ్ళాడో, జైల్లో అతను కరుడు గట్టిన రాక్షస నాయకుడు శివ (సత్యదేవ్) స్వయానా తన అన్నయ్యని తెలుస్తుంది. అయితే ఈ నిజం బయటపెట్టకుండా తన పని మొదలుపెడతాడు సూరి. శివ అలా ఎందుకు మారాడు, అక్కడ రాక్షసుల్లాంటి మనుషులను కట్టడి చేసే ప్రయత్నంలో సూరి లీడర్ గా ఎలా మారాడు అనేది కింగ్డమ్ ప్రపంచంలో చూడాలి. ఇదంతా పీరియాడిక్ సెటప్ లో వెనుకటి కాలంలో జరుగుతుంది.
విజువల్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. కెజిఎఫ్, పుష్ప రేంజ్ మేకింగ్ తో గౌతమ్ తిన్ననూరి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎంటర్ టైన్మెంట్ లేకుండా ఎమోషన్, యాక్షన్ మీద దృష్టి పెట్టి విజయ్ దేవరకొండని లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ తో చూపించిన తీరు కొత్తగా ఉంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ షో కాకుండా ఈసారి పెర్ఫార్మన్స్ దక్కించుకుంది. సత్యదేవ్ స్పెషల్ ప్యాకేజ్ కాబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఎప్పటిలాగే మంచి ఎలివేషన్ ఇచ్చింది. స్టోరీ పరంగా ఇప్పటిదాకా ఉన్న సస్పెన్స్ వీగిపోయింది. థియేటర్లలో సూరి చూపించబోయే విశ్వరూపం ఎలా ఉండబోతోందో జూలై 31 తేలనుంది.
This post was last modified on July 27, 2025 9:03 am
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…