రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కింగ్డమ్ జూలై 31 విడుదలకు రెడీ అవుతోంది. నిన్న తిరుపతిలో ఘనంగా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. చెప్పిన టైం కన్నా బాగా ఆలస్యంగా యూట్యూబ్ లోకి వచ్చిన కంటెంట్ కోసం అభిమానులు తెగ ఎదురు చూశారు. ది ఫ్యామిలీ స్టార్ తర్వాత ఏడాది పైగా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. అందులోనూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అయిదేళ్ళు ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డాడంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి కథ దాచే ప్రయత్నం చేయకుండా స్పష్టంగా రివీల్ చేశారు.
సూరి (విజయ్ దేవరకొండ) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక సీక్రెట్ మిషన్ కోసం తన ఉనికిని మార్చుకుని, కుటుంబాన్ని వదులుకుని శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది. ఎవరినైతే తాను పట్టుకోవాలనే లక్ష్యంతో వెళ్ళాడో, జైల్లో అతను కరుడు గట్టిన రాక్షస నాయకుడు శివ (సత్యదేవ్) స్వయానా తన అన్నయ్యని తెలుస్తుంది. అయితే ఈ నిజం బయటపెట్టకుండా తన పని మొదలుపెడతాడు సూరి. శివ అలా ఎందుకు మారాడు, అక్కడ రాక్షసుల్లాంటి మనుషులను కట్టడి చేసే ప్రయత్నంలో సూరి లీడర్ గా ఎలా మారాడు అనేది కింగ్డమ్ ప్రపంచంలో చూడాలి. ఇదంతా పీరియాడిక్ సెటప్ లో వెనుకటి కాలంలో జరుగుతుంది.
విజువల్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. కెజిఎఫ్, పుష్ప రేంజ్ మేకింగ్ తో గౌతమ్ తిన్ననూరి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎంటర్ టైన్మెంట్ లేకుండా ఎమోషన్, యాక్షన్ మీద దృష్టి పెట్టి విజయ్ దేవరకొండని లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ తో చూపించిన తీరు కొత్తగా ఉంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ షో కాకుండా ఈసారి పెర్ఫార్మన్స్ దక్కించుకుంది. సత్యదేవ్ స్పెషల్ ప్యాకేజ్ కాబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఎప్పటిలాగే మంచి ఎలివేషన్ ఇచ్చింది. స్టోరీ పరంగా ఇప్పటిదాకా ఉన్న సస్పెన్స్ వీగిపోయింది. థియేటర్లలో సూరి చూపించబోయే విశ్వరూపం ఎలా ఉండబోతోందో జూలై 31 తేలనుంది.
This post was last modified on July 27, 2025 9:03 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…