ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. మానగరం అనే హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. ఖైదీ మూవీతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తర్వాత అతను తీసిన మాస్టర్ ఓ మోస్తరుగా ఆడగా.. విక్రమ్ బ్లాక్ బస్టర్ అయింది. తర్వాతి చిత్రం లియో అంచనాలను అందుకోకపోయినా లోకేష్ క్రేజ్ అయితే తగ్గలేదు. తన కొత్త సినిమా కూలీకి మామూలు హైప్ లేదు. లోకేష్ ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్ట్ పెద్దదే. ఖైదీ-2, విక్రమ్=2, రోలెక్స్ చిత్రాలతో పాటు ఆమిర్ ఖాన్తో సైతం ఒక సినిమాను ప్లాన్ చేశాడు. దర్శకుడిగా ఇంత బిజీగా ఉన్న అతను.. హీరోగా కూడా అరంగేట్రం చేయబోతున్నాడు. ప్రాపర్ కమర్షియల్ సినిమాతోనే తాను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అతను వెల్లడించాడు.
కీర్తి సురేష్తో సాని కాయితం, ధనుష్తో కెప్టెన్ మిల్లర్ సినిమాలు తీసిన అరుణ్ మాథేశ్వరన్.. లోకేష్ను హీరోగా పరిచయం చేయనున్నాడట. వీరి కలయికలో రాబోయేది గ్యాంగ్స్టర్ మూవీ అట. అందులో హీరో పాత్రకు తగ్గట్లుగా ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు ఒక ఇంటర్వ్యూలో లోకేష్ వెల్లడించాడు. కెప్టెన్ మిల్లర్ తర్వాత అరుణ్.. ధనుష్తో ఇళయరాజా బయోపిక్ చేయాల్సింది. కానీ ఆ సినిమా ఆలస్యం అవుతుండడంతో దాని కంటే ముందు లోకేష్ హీరోగా సినిమా చేయనున్నాడట.
ఈ సినిమా కోసం తాను బరువు తగ్గి, కండలు పెంచడంతో పాటు గడ్డం కూడా పెంచుతున్నట్లు లోకేష్ వెల్లడించాడు. తాను ఖైదీ-2 సినిమా మొదలుపెట్టడానికి 8 నెలలు పడుతుందని.. ఆ సినిమాకు స్క్రిప్టు రెడీగా ఉందని.. ఈలోపు హీరోగా సినిమాను పూర్తి చేస్తానని లోకేష్ తెలిపాడు. లోకేష్ ఇప్పటికే శ్రుతి హాసన్తో కలిసి ఇనిమేల్ అనే మ్యూజిక్ వీడియోలో నటించాడు. అందులో తన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు బాగానే అనిపించాయి. నటుడిగా పనికొస్తాడనే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఫీచర్ ఫిలిం హీరో అయిపోతున్నాడు. దర్శకుడిగా ఉన్న క్రేజ్ హీరోగా తన సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. కూలీ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 26, 2025 8:11 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…