యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్ ,హ్యుమర్ అన్నీ మిక్స్ చేసిన స్పై డ్రామా ‘చైనా పీస్’ టీజర్ అదిరిపోయింది.
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా, అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై నిర్మించారు. కమల్ కామరాజు, రఘు బాబు లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగా… ఇప్పుడు వచ్చిన టీజర్ అయితే అదే బజ్ను ఇంకో లెవెల్కి తీసుకెళ్లింది.
దాదాపు 2 నిమిషాల నిడివిగల ఈ టీజర్ యాక్షన్, సస్పెన్స్, కామెడీ, డ్రామా అన్ని మిక్స్ చేసిన పక్కా ఎంటర్టైనర్ అనిపించింది.
దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన టాప్ సీక్రెట్ డేటా శత్రువుల చేతికి ఎలా చిక్కిందో… దాన్ని తిరగదొంగిలించడానికి జరుగుతున్న మిషన్ ఎలా సాగుతుందో టీజర్ లో చూపించిన తీరు థ్రిల్లింగ్ గా ఉంది.
నిహాల్ పాత్ర ఓ మామూలు కుర్రాడిలా ప్రారంభమవుతుంది. కాని ఓ ట్విస్టుతో అతడిని టెర్రరిస్ట్గా కస్టడీలోకి తీసుకోవడం, అక్కడి నుంచి మొదలయ్యే కథ కట్టి పడేస్తుంది.
నిహాల్ శ్రీశ్రీ కవితని తెలుగు-ఉర్దూ మిక్స్ చేసి చెప్పే సీన్… టెన్షన్ మధ్యన కూడా నవ్వు తెప్పిస్తుంది.
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కమల్ కామరాజు యాక్టింగ్, రఘు బాబు టైమింగ్ కూడా టీజర్ లోనే ఆకట్టుకుంటున్నాయి.
దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి తీసుకున్న కాన్సెప్ట్, చెప్పిన విధానం చూసి యూనిక్ గా వున్నాయి. గ్రాండుగా కనిపించే ప్రొడక్షన్ వాల్యూస్, ఇంటెన్స్ బీజీఎమ్, స్టైలిష్ విజువల్స్ అన్నీ కలిపి ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మొత్తానికి చైనా పీస్ టీజర్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూసేలా చేసింది.
This post was last modified on July 26, 2025 4:50 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…