హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నా శ్రీలీల అవకాశాలకు ఎలాంటి ఢోకా లేకుండా పోతోంది. మాములుగా సక్సెస్ ని ప్రామాణికంగా తీసుకునే ఇండస్ట్రీలో దాన్ని పట్టించుకోకుండా ఆఫర్లు వచ్చేలా చేసుకోవడం శ్రీలీలకే చెల్లింది. ఈ ఏడాది తను బాలీవుడ్ డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఆషీకీ 3 (ప్రచారంలో ఉన్న టైటిల్) తో పెద్ద ఎంట్రీనే దక్కించుకుంది. దీని షూటింగ్ కోసమే ముంబైలో ఎక్కువగా ఉంటున్న శ్రీలీల ఇది తనకు పెద్ద బ్రేక్ అవుతుందనే అంచనాలో ఉంది. ఇటీవలే సైయారా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈ మూవీ మీద మంచి హైప్ నెలకొంది.
ఇదింకా నిర్మాణంలో ఉండగానే శ్రీలీల మరో క్రేజీ మూవీ దక్కించుకుందని ముంబై టాక్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించబోయే భారీ యాక్షన్ మూవీలో ఆమెను లాక్ చేసుకున్నట్టు సమాచారం. ఓపెనింగ్ రోజు అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. ఇందులో విలన్ గా బాబీ డియోల్ నటించబోతున్నాడు. అయితే ఇది ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు డాన్ 3నా లేక వేరొకటా అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో ఆఫర్లకు లోటు లేకపోయినా శ్రీలీలను ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. ఇటీవలే కిరీటి జూనియర్ సైతం ఫ్లాప్ లిస్టులోకి చేరిపోయింది. డాన్సులకు పేరొస్తోంది కానీ పెర్ఫార్మన్స్ దక్కడం లేదు.
శ్రీలీల బాలీవుడ్ మీద ఇంత ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం లక్కీగా నటనకు స్కోప్ ఉన్నవి దక్కడమే కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక్ ఆర్యన్ మూవీలో ప్రియురాలిగా చాలా డెప్త్ ఉన్న షేడ్స్ ఉన్నాయట. వాటి ద్వారా ఆమెలో ఎంత నటి దాగి ఉందో పరిశ్రమకు అర్థమవుతుందని యూనిట్ వర్గాల మాట. మసాలా డాన్సులు, హంగులు హంగామాలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమను చూపించేలా అనురాగ్ బసు ఈ సినిమా తీస్తున్నారని తెలిసింది. ఇక రణ్వీర్ సింగ్ లాంటి పవర్ హౌస్ పక్కన నటించడం కూడా ఒక రకంగా జాక్ పాట్ లాంటిది. ఇవి క్లిక్ అయితే హిందీలోనూ శ్రీలీల బిజీ అయిపోవచ్చు.
This post was last modified on July 26, 2025 11:27 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…