భారీ పారితోషకాలు, సకల సౌకర్యాల సంగతెలా ఉన్నప్పటికీ సినిమాల కోసం హీరోల కష్టం తక్కువేమీ కాదు. పాత్రల కోసం అవతారాలు మార్చుకోవడం, ఫిజిక్ మెయింటైన్ చేయడం.. ఇబ్బందికర పరిస్థితుల మధ్య షూటింగ్ చేయడం.. పాత్రల కోసం హోం వర్క్ చేయడం.. ఇలా చాలా వ్యవహారాలే ఉంటాయి. హీరోలకు సంబంధించి ప్రతి విషయాన్నీ నిశితంగా గమనిస్తారు, సినిమాలు సేల్ అయ్యేదే వాళ్ల పేరు మీద కాబట్టి వాళ్లు ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
కొన్ని నెలల పాటు ఎక్కడలేని ఏకాగ్రతతో నిర్విరామంగా పని చేసి బాగా స్ట్రెస్ అవుతుంటారు హీరోలు. అంత కష్టపడి సినిమా పూర్తి చేశాక చిల్ అవడం కోసం సన్నిహితులతో పార్టీల్లో మునిగితేలుతుంటారు. పెళ్లిళ్లు అయిన హీరోలు సైతం చాలా మంది స్నేహితులతో చిల్ అవడానికే చూస్తారు. పార్టీల మీద పార్టీలు చేసుకుంటారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇందుకు భిన్నం.
టాలీవుడ్లో వేరే హీరోలు కూడా కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు కానీ.. మహేష్ బాబు స్థాయిలో మాత్రం ఫ్యామిలీ కమిట్మెంట్ చూపించే వాళ్లు ఇంకొకరు కనిపించరంటే అతిశయోక్తి కాదు. మహేష్ వేరే వాళ్లతో చిల్ కావడం అరుదు. కొన్ని ఆబ్లిగేషన్ల మీద తన సినిమాల సక్సెస్ పార్టీల్లో వేరే వాళ్లతో కనిపించాడేమో కానీ.. మహేష్కు రిలాక్సేషన్ అంటే ఫ్యామిలీతోనే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే.. సినిమా మొదలవడానికి ముందు, పూర్తయ్యాక ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లాల్సిందే. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ.
కరోనా టైంలో పూర్తిగా ఇంటి పట్టున కుటుంబంతో గడిపిన మహేష్.. త్వరలో తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ను మొదలుపెట్టనున్న నేపథ్యంలో భార్యా పిల్లలతో కలిసి ఆనవాయితీ ప్రకారం వెకేషన్కు వెళ్లొచ్చేశాడు. ఎప్పుడూ మహేష్ను వెకేషన్లో ఫ్యామిలీతో కలిపి జనాలకు బోర్ కొట్టేస్తుండొచ్చు. కానీ అతను మాత్రం తనకు కుటుంబాన్ని మించిన ఆనందం లేదన్నట్లుగా తన ఆనవాయితీని కొనసాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ ‘ఫ్యామిలీ మ్యాన్’ మహేషే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…