టాలీవుడ్లో చాన్నాళ్ల తర్వాత ఓ భారీ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది. అదే.. హరిహర వీరమల్లు. మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర హంగామా మామూలుగా ఉండదు. పైగా ఇది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం. ఏడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న స్ట్రెయిట్ మూవీ. అందులోనూ ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన, హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఉన్న భారీ చిత్రం. కొన్ని రోజుల ముందు వరకు ఈ చిత్రానికి హైప్ తక్కువగానే ఉంది కానీ… ఇప్పుడు కథ మారింది. పవన్ సినిమాల విషయంలో అదే జరిగేది. ముందు అభిమానులు పెద్దగా ఆసక్తి లేనట్లు కనిపిస్తారు. రిలీజ్ దగ్గర పడేసరికి ఊగిపోతారు. ‘హరిహర వీరమల్లు’కు కూడా ముందు రోజు మంచి హైప్ కనిపిస్తోంది.
బుధవారం రాత్రి సెకండ్ షో నుంచే ‘హరిహర వీరమల్లు’ హంగామా మొదలు కాబోతోంది. తొలి రోజుకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. దీంతో తొలి రోజు ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందన్నదానిపై అందరి దృష్టీ నిలిచి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రం.. వకీల్ సాబ్. దీని తర్వాత వచ్చిన ‘భీమ్లా నాయక్’కు ఇంకా హైప్ వచ్చినప్పటికీ.. ఏపీలో టికెట్ల రేట్లు బాగా తగ్గించేయడంతో ఆ రికార్డును కొట్టలేకపోయింది. ‘బ్రో’ మూవీలో పవన్ చేసింది అతిథి పాత్ర కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోలేం.
మరి ‘హరిహర వీరమల్లు’ డే-1 ఎంత కలెక్ట్ చేస్తుందన్నది ఆసక్తికరం. బుకింగ్స్ లేటుగా మొదలు కావడం.. తెలంగాణలో స్క్రీన్ల విషయంలో గందరగోళం తలెత్తడం వంటి అంశాలు కొంత ప్రతికూలం కావచ్చు. కానీ ముందు రోజు పెద్ద ఎత్తున ప్రిమియర్స్ వేస్తుండడం.. వాటి టికెట్ల ధరలు రూ.600-700 మధ్య ఉన్న నేపథ్యంలో ఓవరాల్ కలెక్షన్లకు ఇది పెద్ద ప్లస్ అవుతుంది. ఈ ప్రిమియర్లను కూడా కలుపుకుంటే తొలి రోజు ఈ చిత్రం ‘వకీల్ సాబ్’ వసూళ్లను దాటే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే హైప్ పెరిగి రూ.50 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశాలున్నాయి.
This post was last modified on July 24, 2025 10:35 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…