ఈ వారం బిగ్గెస్ట్ రిలీజ్ ‘హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’కు టికెట్లు దొరక్కపోతే ఎలా అనే చింత అక్కర్లేదు అనేలా ఉన్నాయి ఓటిటి కంటెంట్లు. ప్రతివారం థియేటర్ తో పోటీ పడుతున్న డిజిటల్ విడుదల్లో ఈ జూలై 25 శుక్రవారం క్రేజీ సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ కు రివ్యూలలో మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ టైటిల్ కనెక్ట్ కాకపోవడం, మార్కెటింగ్ చేయకపోవడం లాంటి కారణాల వల్ల ఎక్కువ ఆడియన్స్ కి చేరలేదు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ పైకి రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ లా కనిపించినా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ థ్రిల్ ఇస్తాయి.
నవీన్ చంద్ర హీరోగా వచ్చిన ‘షో టైం’కి క్రిటిక్స్ లో మంచి స్పందన వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా నిలబడలేదు. చూసినవాళ్లను మరీ నిరుత్సాహపరచలేదనే మాటైతే వినిపించింది. సన్ నెక్స్ట్ లో చూసుకోవచ్చు. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్, సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్, కాజోల్ కాంబోలో తెరకెక్కిన ‘సర్జమీన్’ తెలుగు ఆడియోతో పాటు అన్ని ప్రధాన భాషల్లో జియో హాట్ స్టార్ ద్వారా అందుబాటులోకి రానుంది. తొలుత థియేటర్ అనుకున్నప్పటికీ నిర్మాతలు మనసు మార్చుకుని ఓటిటికి ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ లో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘మండాలా మర్డర్స్’ మీద అంచనాలు బానే ఉన్నాయి.
భారీ బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ ‘రంగీన్’ ప్రైమ్ లో రానుంది. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినప్పటికీ మగ వేశ్యగా మారిన హీరో పాత్ర చుట్టూ కొత్తగా రాసుకున్నారు. ఇవి కాకుండా రెండు రోజుల క్రితమే మలయాళం హిట్ మూవీ ‘రొంత్’ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ బాగానే వస్తున్నాయి. ఇవి కాకుండా హాలీవుడ్ సినిమాలు చాలానే ఈ రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్నాయి. సో ఇంట్లోనే కాలక్షేపం చేసుకోవడానికి బోలెడంత వినోదం అందుబాటులోకి వస్తోంది. ఓటిటి పరిధి పెరిగిపోయాక భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలు చేరువయ్యాయి. ఆప్షన్లు విపరీతంగా పెరిగిపోయాయి.
This post was last modified on July 23, 2025 4:06 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…