ఈ తరం ప్రేక్షకులకు ఓపిక చాలా తక్కువ. సినిమా రయ్యిన దూసుకెళ్లిపోవాలి. ఆరంభం నుంచే కథనం పరుగులు పెట్టాలి. ఏమాత్రం నెమ్మదించినా.. ‘ల్యాగ్’ అనేస్తారు. సినిమా నిడివి ఎక్కువ ఉన్నా.. ‘ల్యాగ్’ అనే కంప్లైంట్ వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయిన ఈ పదం విషయంలో మలయాళ స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. సినిమాకు ‘ల్యాగ్’ అనేది చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
మలయాళంలో ‘దృశ్యం’, ‘దృశ్యం-2’, ‘నేరు’.. ఇలా అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడు జీతు. ప్రస్తుతం ఆయన మోహన్ లాల్తో ‘దృశ్యం-3’ చేస్తున్నారు. తన సినిమాలు అని కాకుండా మొత్తంగా మలయాళ సినిమల్లో ల్యాగ్ గురించి కంప్లైంట్ చేసే వాళ్లకు ఆయన ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. ఏ కథా ఆరంభం నుంచే పరుగులు పెట్టదని.. ముందు కథకు ఒక పునాది పడడం.. క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ కావడం ఎంతో అవసరమైన విషయాలు అని జీతు అభిప్రాయపడ్డాడు.
ప్రేక్షకులను ఒక మూడ్లోకి తీసుకెళ్లాలంటే కొంత సమయం పడుతుందని.. అలాంటపుడు ల్యాగ్ అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుందని.. సినిమాకు ఈ ‘ల్యాగ్’ చాలా అవసరమని జీతు అన్నాడు. తన కొత్త సినిమా ‘దృశ్యం-3’లో కూడా ఈ ల్యాగ్ ఉంటుందని.. దీనికి ప్రిపేరై ఉండాలని జీతు చెప్పడం విశేషం. దృశ్యం, దృశ్యం-2 సినిమాల్లో కూడా ప్రథమార్ధంలో ఒక దశ వరకు కథ నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ తర్వాత కథలోని మలుపులు బయటికి వచ్చాక కథనం పరుగులు పెడుతుంది. ముందు మామూలుగా తోచిన సన్నివేశాలు కూడా తర్వాత భలేగా అనిపిస్తాయి. అదంతా జీతు స్క్రీన్ ప్లేలోని మ్యాజిక్. ఈ నేపథ్యంలోనే ‘ల్యాగ్’ అనే మాట ఓవర్ రేటెడ్ అంటూ తనదైన శైలిలో విశ్లేషించాడు జీతు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…