ఈ తరం ప్రేక్షకులకు ఓపిక చాలా తక్కువ. సినిమా రయ్యిన దూసుకెళ్లిపోవాలి. ఆరంభం నుంచే కథనం పరుగులు పెట్టాలి. ఏమాత్రం నెమ్మదించినా.. ‘ల్యాగ్’ అనేస్తారు. సినిమా నిడివి ఎక్కువ ఉన్నా.. ‘ల్యాగ్’ అనే కంప్లైంట్ వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయిన ఈ పదం విషయంలో మలయాళ స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. సినిమాకు ‘ల్యాగ్’ అనేది చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
మలయాళంలో ‘దృశ్యం’, ‘దృశ్యం-2’, ‘నేరు’.. ఇలా అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడు జీతు. ప్రస్తుతం ఆయన మోహన్ లాల్తో ‘దృశ్యం-3’ చేస్తున్నారు. తన సినిమాలు అని కాకుండా మొత్తంగా మలయాళ సినిమల్లో ల్యాగ్ గురించి కంప్లైంట్ చేసే వాళ్లకు ఆయన ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. ఏ కథా ఆరంభం నుంచే పరుగులు పెట్టదని.. ముందు కథకు ఒక పునాది పడడం.. క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ కావడం ఎంతో అవసరమైన విషయాలు అని జీతు అభిప్రాయపడ్డాడు.
ప్రేక్షకులను ఒక మూడ్లోకి తీసుకెళ్లాలంటే కొంత సమయం పడుతుందని.. అలాంటపుడు ల్యాగ్ అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుందని.. సినిమాకు ఈ ‘ల్యాగ్’ చాలా అవసరమని జీతు అన్నాడు. తన కొత్త సినిమా ‘దృశ్యం-3’లో కూడా ఈ ల్యాగ్ ఉంటుందని.. దీనికి ప్రిపేరై ఉండాలని జీతు చెప్పడం విశేషం. దృశ్యం, దృశ్యం-2 సినిమాల్లో కూడా ప్రథమార్ధంలో ఒక దశ వరకు కథ నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ తర్వాత కథలోని మలుపులు బయటికి వచ్చాక కథనం పరుగులు పెడుతుంది. ముందు మామూలుగా తోచిన సన్నివేశాలు కూడా తర్వాత భలేగా అనిపిస్తాయి. అదంతా జీతు స్క్రీన్ ప్లేలోని మ్యాజిక్. ఈ నేపథ్యంలోనే ‘ల్యాగ్’ అనే మాట ఓవర్ రేటెడ్ అంటూ తనదైన శైలిలో విశ్లేషించాడు జీతు.
This post was last modified on July 22, 2025 12:53 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…