ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో ‘సైకో’ పేరుతో ఓ సినిమా వచ్చింది. విభిన్న చిత్రాల దర్శకుడు మిస్కిన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఉదయనిధి స్టాలిన్, అదితి రావు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక సైకో కిల్లర్ అమ్మాయిల్ని తీసుకెళ్లి దారుణమైన రీతిలో చంపేస్తుంటాడు. హీరోయిన్ కూడా అలాగే సైకో కిల్లర్ బారిన పడుతుంది. అంధుడైన హీరో ఆమెను ఆ సైకో నుంచి ఎలా కాపాడాడన్నది ఈ చిత్ర కథ.
ఇప్పుడు సరిగ్గా ఇలాంటి కథతో మరో సినిమా తెరకెక్కింది. ఐతే ఇందులో హీరో లేడు. హీరోయినే సేవియర్. ఆమె అంధురాలు కావడం ప్రత్యేకత. ఆ పాత్రను లేడీ సూపర్ స్టార్ నయనతార పోషించడం ఈ సినిమాలో మేజర్ హైలైట్. ఆ చిత్రం పేరు.. నేత్రికన్ (తెలుగులో మూడో కన్ను అని అర్థం). బుధవారం నయన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ‘సైకో’ను మించి ఆసక్తి రేకెత్తించేలా, ఒళ్లు గగుర్పొడిచేలా టీజర్లో విజువల్స్ ఉన్నాయి.
అమ్మాయిల్ని సైకో కిల్లర్ తీసుకెళ్లి హింసించే తీరును భయానకంగా చూపించి.. ఆ తర్వాత ఆ కిల్లర్ను ఫ్రేమ్ చేయడం.. అతడికి, ఆమెకు మధ్య ఎత్తులు పైఎత్తులు సాగడాన్ని ఆసక్తికరంగా టీజర్లో ప్రెజెంట్ చేశారు. విజువల్స్.. ఎడిటింగ్.. మ్యూజిక్.. అన్నీ కూడా టాప్ నాచ్ అనిపిస్తున్నాయి. ఇంతకుముందు సిద్దార్థ్ హీరోగా ‘అవల్’ (తెలుగులో గృహం) చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మిలింద్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ‘అవల్’ సంగీత దర్శకుడే అయిన గిరీష్ గోపాలకృష్ణన్ అదిరిపోయే స్కోర్ ఇచ్చాడని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.
నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించడమే కాక అన్ని పాటలూ తనే రాశాడు. నయన్కు తెలుగులో కూడా మంచి మార్కెట్టే ఉన్న నేపథ్యంలో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశముంది. ఆమె స్థాయి సూపర్ స్టార్ అంధురాలిగా నటిస్తూ.. సైకో కిల్లర్ పని పట్టడం అనే పాయింట్ ఆసక్తి రేకెత్తించేదే. థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on November 18, 2020 1:29 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…