రకరకాల అవాంతరాలు, అడ్డంకులు, యూనిట్ సభ్యుల హఠాన్మరణాలతో ఉక్కిరిబిక్కిరి అయిన కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 షూటింగ్ అయిపోయింది. ఈ మేరకు అధికారిక మేకింగ్ వీడియోతో హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి దీన్ని ప్రకటించేశారు. ఏమైనా వాయిదా పడుతుందేమోననే ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేశారు. హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ మేకింగ్ వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం. గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న గ్యారెంటీని రెండు నిమిషాల వీడియోలోని ప్రతి ఫ్రేమ్ లో ఇచ్చారు.
ఇందులో కంటెంట్ సంగతి పక్కనపెడితే కాంతార పోటీని తక్కువంచనా వేసిన ఎవరైనా ఇప్పుడు ఆలోచించుకోక తప్పదనేలా ఉంది. పేరుకి డబ్బింగ్ లా కనిపిస్తున్నప్పటికీ తెలుగులోనూ కాంతారకి కెజిఎఫ్ రేంజ్ లో సీక్వెల్ హైప్ ఉంది. ఎందుకంటే మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా రెండు వారాలు ఆలస్యంగా రిలీజైనా నలభై కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చింది. దీంతో ఈసారి అంతకు మించి వసూలు చేస్తుందనే ధీమా బిజినెస్ వర్గాల్లో ఉంది. అక్టోబర్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న కాంతార ఏ లెజెండ్ చాప్టర్ మీద అన్ని భాషలు కలిపి రెండు వందల కోట్లకు పైగానే బిజినెస్ జరిగేలా ఉంది.
ఇక పోటీ విషయానికి వస్తే అక్టోబర్ 1 ధనుష్ ఇడ్లి కడాయ్ వస్తుంది. దానికన్నా వారం ముందు పవన్ కళ్యాణ్ ఓజి, బాలకృష్ణ అఖండ 2లో ఉన్నాయి కనక వెంటనే వారం గ్యాప్ లో కొత్త సినిమాలు రిలీజ్ చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు సాహసించడం లేదు. సో కాంతారకు ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. ఏపీ తెలంగాణలో హోంబాలేకి బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, సపోర్ట్ ఉంది. ఒకవేళ ఓజి, అఖండ 2 క్లాష్ అయినా తగినన్ని స్క్రీన్లు దక్కించుకోవడంతో మద్దతు దొరుకుతుంది. టాక్ కనక బాగా వస్తే మాత్రం రిషబ్ శెట్టి చేయబోయే భీభత్సం ఓ రేంజ్ లో ఉంటుంది. మేకింగ్ వీడియోలో అది కనిపిస్తోంది కూడా.
This post was last modified on July 21, 2025 11:08 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…