రకరకాల అవాంతరాలు, అడ్డంకులు, యూనిట్ సభ్యుల హఠాన్మరణాలతో ఉక్కిరిబిక్కిరి అయిన కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 షూటింగ్ అయిపోయింది. ఈ మేరకు అధికారిక మేకింగ్ వీడియోతో హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి దీన్ని ప్రకటించేశారు. ఏమైనా వాయిదా పడుతుందేమోననే ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేశారు. హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ మేకింగ్ వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం. గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న గ్యారెంటీని రెండు నిమిషాల వీడియోలోని ప్రతి ఫ్రేమ్ లో ఇచ్చారు.
ఇందులో కంటెంట్ సంగతి పక్కనపెడితే కాంతార పోటీని తక్కువంచనా వేసిన ఎవరైనా ఇప్పుడు ఆలోచించుకోక తప్పదనేలా ఉంది. పేరుకి డబ్బింగ్ లా కనిపిస్తున్నప్పటికీ తెలుగులోనూ కాంతారకి కెజిఎఫ్ రేంజ్ లో సీక్వెల్ హైప్ ఉంది. ఎందుకంటే మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా రెండు వారాలు ఆలస్యంగా రిలీజైనా నలభై కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చింది. దీంతో ఈసారి అంతకు మించి వసూలు చేస్తుందనే ధీమా బిజినెస్ వర్గాల్లో ఉంది. అక్టోబర్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న కాంతార ఏ లెజెండ్ చాప్టర్ మీద అన్ని భాషలు కలిపి రెండు వందల కోట్లకు పైగానే బిజినెస్ జరిగేలా ఉంది.
ఇక పోటీ విషయానికి వస్తే అక్టోబర్ 1 ధనుష్ ఇడ్లి కడాయ్ వస్తుంది. దానికన్నా వారం ముందు పవన్ కళ్యాణ్ ఓజి, బాలకృష్ణ అఖండ 2లో ఉన్నాయి కనక వెంటనే వారం గ్యాప్ లో కొత్త సినిమాలు రిలీజ్ చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు సాహసించడం లేదు. సో కాంతారకు ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. ఏపీ తెలంగాణలో హోంబాలేకి బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, సపోర్ట్ ఉంది. ఒకవేళ ఓజి, అఖండ 2 క్లాష్ అయినా తగినన్ని స్క్రీన్లు దక్కించుకోవడంతో మద్దతు దొరుకుతుంది. టాక్ కనక బాగా వస్తే మాత్రం రిషబ్ శెట్టి చేయబోయే భీభత్సం ఓ రేంజ్ లో ఉంటుంది. మేకింగ్ వీడియోలో అది కనిపిస్తోంది కూడా.
This post was last modified on July 21, 2025 11:08 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…