సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు షూటింగ్ అయితే జరుగుతోంది కానీ బయటికి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా టీమ్ సైలెంట్ గా ఉంది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం సెప్టెంబర్ 25 రిలీజవ్వాలి. కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజి ఫిక్స్ కావడంతో మేనమామను ఎదురుగా పెట్టుకుని పోటీ చేసే సాహసం అల్లుడు కల్లో కూడా ఊహించుకోడు. ఒకవేళ అఖండ 2 మాత్రమే ఉంటే రిస్క్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడా ఛాన్స్ లేకుండా పోయింది. నెక్స్ట్ఉన్న ఆప్షన్ అక్టోబర్. కానీ ఇప్పటికైతే డేట్ గురించి నిర్ణయం తీసుకోలేదని ఇన్ సైడ్ టాక్.
ఇక్కడో సమస్య ఉంది. ప్రతి నెల కీలకమైన శుక్రవారాలు ఏదో ఒక ప్యాన్ ఇండియా మూవీతో బ్లాక్ అయిపోయాయి. అక్టోబర్ మొదటి వారంలోనే కాంతార చాప్టర్ 1, ఇడ్లీ కడాయ్ వస్తున్నాయి. మూడో వారంలో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ బిజినెస్ వ్యవహారాలు పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి. దర్శకుడు వశిష్ఠ ఇస్తున్న క్లూలను చూస్తుంటే విశ్వంభర కూడా అదే నెలలో రానుంది. ఇది నిజమైతే సాయితేజ్ కు మరో సంకటం ఎదురవుతుంది. అప్పుడు నవంబర్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కానీ అది డ్రై మంత్. వంద కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలు ఆ సీజన్ లో వర్కౌట్ చేసుకోవడం కష్టం.
నెక్స్ట్ ఉన్నది డిసెంబర్. స్టోరీ అయిపోలేదు. ప్రభాస్ ది రాజా సాబ్ తో పాటు రణ్వీర్ సింగ్ దురంధర్ అయిదో తేదీని పట్టేసుకున్నాయి. క్రిస్మస్ ని అడవి శేష్ డెకాయిట్ తీసేసుకుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అఖండ 2, ఓజి, విశ్వంభర వీటిలో ఏదైనా ఒకటి పైన చెప్పిన నెలల్లో రాకపోతే దానికి ఇయర్ ఎండింగ్ తప్ప మరో మార్గం ఉండదు. ఎందుకంటే సంక్రాంతి స్లాట్స్ ఆల్రెడీ చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, తమిళ హీరో విజయ్ తీసేసుకున్నారు. సో సంబరాల ఏటిగట్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కెపి రోహిత్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on July 20, 2025 8:05 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…