Movie News

నిఖిల్ చెప్పింది ఆలోచించాల్సిన విషయమే

ఎంతసేపూ టికెట్ రేట్లు పెరగడం వల్లే జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారనే కోణంలోనే చర్చ జరుగుతోంది తప్ప నిజానికి క్యాంటీన్ లో అధిక ధరలకు అమ్ముతున్న స్నాక్స్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతోందో ఇండస్ట్రీ పెద్దలు గుర్తించడం లేదు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్పించి అవి అమలవుతున్న దాఖలాలు కనిపించవు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ దోపిడీ మాములుగా లేదు. పెద్ద స్టార్ హీరో సినిమాకు నైజాంలో గరిష్ట టికెట్ ధర 295 రూపాయలు ఉంటే పాప్ కార్న్ స్టార్టింగ్ రేట్ 300 నుంచి 900 రూపాయల దాకా ఉంటుంది. వాటర్ బాటిల్ వందకు అమ్ముతున్న ఉదాహరణలు ఎన్నో.

తాజాగా హీరో నిఖిల్ దీని గురించి ఒక ట్వీట్ వేసి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు సీరియస్ గా పరిష్కారం చూడాలని కోరాడు. తనకు సినిమా టికెట్ కు అయిన ఖర్చు కన్నా చాలా ఎక్కువ స్నాక్స్ కు పెట్టానని పేర్కొన్నాడు. ఇమేజ్, సంపాదన, ప్యాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్న మార్కెట్ ఉన్న నిఖిల్ కే అలా అనిపిస్తే ఇక మధ్య తరగతి ప్రేక్షకుల గురించి చెప్పేదేముంది. పిల్లలు అడిగితే కొనివ్వడకుండా ఉండలేని నిస్సహాయతను అనుభవించడం కన్నా అసలు మల్టీప్లెక్సులకే దూరంగా ఉంటే బెటరనే అభిప్రాయం మిడిల్ క్లాస్ జీవుల్లో ఉంది. అందుకే వీక్ డేస్ లో చాలా స్క్రీన్లు జనం లేక షోలు క్యాన్సిలవుతూ ఉంటాయి.

కార్పొరేట్ ముసుగులో జరుగుతున్న ఈ దందా పూర్తిగా ఆపేయలేం కానీ కనీస నియంత్రణ అవసరం చాలా ఉంది. నిఖిల్ అన్నట్టు ఒక నీళ్ల బాటిల్ తీసుకెళ్లే స్వాతంత్రం లేనప్పుడు ఖర్చు మీద అదుపు ఎలా వస్తుంది. వసూళ్ల మాయలో పడి ఈ స్నాక్స్ ధరలు చేస్తున్న చేటు చాలా మంది గుర్తించడం లేదు. వీటి వల్ల ఎక్కువగా దెబ్బ తింటున్నది చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ సినిమాలే. అందుబాటు రేట్లలో ఇటు టికెట్ల లేక, అటు తినుబండారాలు లేక మొత్తంగానే థియేటర్ కు దూరమవుతున్నారు. కేవలం ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చినప్పుడు మాత్రమే టికెట్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముందు మారాల్సింది ఇది.

Kumar

Recent Posts

ఫౌజీ మాట తప్పే అవకాశం లేదు

ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు…

1 hour ago

మూడు రిస్కులకు అల్లు అర్జున్ సిద్ధం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…

4 hours ago

అమెరికా కొత్త బాంబ్… ఇండియాకు 100% టారిఫ్ సెగ?

రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…

4 hours ago

ముద్రగడ నివాసంలో రాజకీయమెందుకు

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా  తీవ్ర అనారోగ్యంతో సతమతం…

4 hours ago

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

8 hours ago

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…

13 hours ago