Movie News

నిఖిల్ చెప్పింది ఆలోచించాల్సిన విషయమే

ఎంతసేపూ టికెట్ రేట్లు పెరగడం వల్లే జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారనే కోణంలోనే చర్చ జరుగుతోంది తప్ప నిజానికి క్యాంటీన్ లో అధిక ధరలకు అమ్ముతున్న స్నాక్స్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతోందో ఇండస్ట్రీ పెద్దలు గుర్తించడం లేదు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్పించి అవి అమలవుతున్న దాఖలాలు కనిపించవు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ దోపిడీ మాములుగా లేదు. పెద్ద స్టార్ హీరో సినిమాకు నైజాంలో గరిష్ట టికెట్ ధర 295 రూపాయలు ఉంటే పాప్ కార్న్ స్టార్టింగ్ రేట్ 300 నుంచి 900 రూపాయల దాకా ఉంటుంది. వాటర్ బాటిల్ వందకు అమ్ముతున్న ఉదాహరణలు ఎన్నో.

తాజాగా హీరో నిఖిల్ దీని గురించి ఒక ట్వీట్ వేసి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు సీరియస్ గా పరిష్కారం చూడాలని కోరాడు. తనకు సినిమా టికెట్ కు అయిన ఖర్చు కన్నా చాలా ఎక్కువ స్నాక్స్ కు పెట్టానని పేర్కొన్నాడు. ఇమేజ్, సంపాదన, ప్యాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్న మార్కెట్ ఉన్న నిఖిల్ కే అలా అనిపిస్తే ఇక మధ్య తరగతి ప్రేక్షకుల గురించి చెప్పేదేముంది. పిల్లలు అడిగితే కొనివ్వడకుండా ఉండలేని నిస్సహాయతను అనుభవించడం కన్నా అసలు మల్టీప్లెక్సులకే దూరంగా ఉంటే బెటరనే అభిప్రాయం మిడిల్ క్లాస్ జీవుల్లో ఉంది. అందుకే వీక్ డేస్ లో చాలా స్క్రీన్లు జనం లేక షోలు క్యాన్సిలవుతూ ఉంటాయి.

కార్పొరేట్ ముసుగులో జరుగుతున్న ఈ దందా పూర్తిగా ఆపేయలేం కానీ కనీస నియంత్రణ అవసరం చాలా ఉంది. నిఖిల్ అన్నట్టు ఒక నీళ్ల బాటిల్ తీసుకెళ్లే స్వాతంత్రం లేనప్పుడు ఖర్చు మీద అదుపు ఎలా వస్తుంది. వసూళ్ల మాయలో పడి ఈ స్నాక్స్ ధరలు చేస్తున్న చేటు చాలా మంది గుర్తించడం లేదు. వీటి వల్ల ఎక్కువగా దెబ్బ తింటున్నది చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ సినిమాలే. అందుబాటు రేట్లలో ఇటు టికెట్ల లేక, అటు తినుబండారాలు లేక మొత్తంగానే థియేటర్ కు దూరమవుతున్నారు. కేవలం ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చినప్పుడు మాత్రమే టికెట్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముందు మారాల్సింది ఇది.

This post was last modified on July 20, 2025 6:01 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nikhil

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

16 minutes ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

17 minutes ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

60 minutes ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

9 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

10 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

11 hours ago