Movie News

ఏపి వీరమల్లు టికెట్లు… వీరలెవెల్లో పెంపు

అభిమానులు ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో కొలిక్కి వచ్చేసింది. పది రోజుల పాటు మల్టీప్లెక్సుల్లో టికెట్ మీద 200 రూపాయలు, సింగల్ స్క్రీన్ అప్పర్ బాల్కనీ 150, లోయర్ క్లాస్ 100 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కలిగిస్తూ ఏపీ ప్రభుత్వం జిఓ జారీ చేసింది. అంతేకాదు ముందు రోజు జూలై 23 రాత్రి స్పెషల్ ప్రీమియర్లకు కూడా అనుమతి ఇచ్చి, దీనికి ఫ్లాట్ 600 రూపాయల టికెట్ ధరని నిర్ణయించారు. ఇది అన్ని థియేటర్లకు ఒకటే ఉంటుంది. జూలై 24 నుంచి ఆగస్ట్ 2 దాకా ముందు చెప్పిన పెంపులు అమలులో ఉంటాయి.

అయిదేళ్ల సుదీర్ఘ నిర్మాణం, వందల కోట్ల బడ్జెట్, భారీ విఎఫ్ఎక్స్, పెద్ద తారాగణంతో నిర్మించిన ఈ విజువల్ గ్రాండియర్ ను మాములు రేట్లకు చూపించలేమని, పెట్టిన ఖర్చుకు తగ్గట్టు రిటర్న్స్ కోరుకుంటున్నామని, అంతే తప్ప లాభాల కోసం కాదని నిర్మాత ఏఎం రత్నం చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ హైక్ తీసుకున్న సినిమాలు లేవు. పుష్ప 2 తర్వాత అంతకన్నా ఎక్కువ పెంపు అందుకున్న హరిహర వీరమల్లు ఖచ్చితంగా ఎక్స్ ట్రాడినరి స్థాయిలో ఉంటేనే పెట్టిన టికెట్  డబ్బులకు ఆడియన్స్ న్యాయంగా ఫీలవుతారు. లేదంటే ఇదే మిస్ ఫైర్ అయ్యే రిస్క్ లేకపోలేదు.

ఏఎం రత్నం, జ్యోతికృష్ణ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నమ్మకం పెట్టుకోవచ్చనే స్థాయిలో ఉంది. అంతర్గత రిపోర్ట్స్ సానుకూలంగా ఉండటం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేపుతోంది. గత నెల రోజులుగా బాక్సాఫీస్ డ్రైగా ఉంది. కుబేర హిట్ తర్వాత కన్నప్ప నుంచి జూనియర్ దాకా ఏ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఎఫ్1, జురాసిక్ వరల్డ్ రీ బర్త్, సూపర్ మ్యాన్ లాంటి హాలీవుడ్ మూవీస్ సొమ్ములు చేసుకున్నాయి. ఆఖరికి సైయారాకు సైతం మంచి నెంబర్లు కనిపించడానికి కారణం ఇదే. ఇప్పుడు హరిహర వీరమల్లు కనక సాలిడ్ హిట్టు కొడితే థియేటర్లు మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతాయి.

Kumar

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

11 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

1 hour ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

1 hour ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

3 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

3 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago