అభిమానులు ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో కొలిక్కి వచ్చేసింది. పది రోజుల పాటు మల్టీప్లెక్సుల్లో టికెట్ మీద 200 రూపాయలు, సింగల్ స్క్రీన్ అప్పర్ బాల్కనీ 150, లోయర్ క్లాస్ 100 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కలిగిస్తూ ఏపీ ప్రభుత్వం జిఓ జారీ చేసింది. అంతేకాదు ముందు రోజు జూలై 23 రాత్రి స్పెషల్ ప్రీమియర్లకు కూడా అనుమతి ఇచ్చి, దీనికి ఫ్లాట్ 600 రూపాయల టికెట్ ధరని నిర్ణయించారు. ఇది అన్ని థియేటర్లకు ఒకటే ఉంటుంది. జూలై 24 నుంచి ఆగస్ట్ 2 దాకా ముందు చెప్పిన పెంపులు అమలులో ఉంటాయి.
అయిదేళ్ల సుదీర్ఘ నిర్మాణం, వందల కోట్ల బడ్జెట్, భారీ విఎఫ్ఎక్స్, పెద్ద తారాగణంతో నిర్మించిన ఈ విజువల్ గ్రాండియర్ ను మాములు రేట్లకు చూపించలేమని, పెట్టిన ఖర్చుకు తగ్గట్టు రిటర్న్స్ కోరుకుంటున్నామని, అంతే తప్ప లాభాల కోసం కాదని నిర్మాత ఏఎం రత్నం చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ హైక్ తీసుకున్న సినిమాలు లేవు. పుష్ప 2 తర్వాత అంతకన్నా ఎక్కువ పెంపు అందుకున్న హరిహర వీరమల్లు ఖచ్చితంగా ఎక్స్ ట్రాడినరి స్థాయిలో ఉంటేనే పెట్టిన టికెట్ డబ్బులకు ఆడియన్స్ న్యాయంగా ఫీలవుతారు. లేదంటే ఇదే మిస్ ఫైర్ అయ్యే రిస్క్ లేకపోలేదు.
ఏఎం రత్నం, జ్యోతికృష్ణ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నమ్మకం పెట్టుకోవచ్చనే స్థాయిలో ఉంది. అంతర్గత రిపోర్ట్స్ సానుకూలంగా ఉండటం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేపుతోంది. గత నెల రోజులుగా బాక్సాఫీస్ డ్రైగా ఉంది. కుబేర హిట్ తర్వాత కన్నప్ప నుంచి జూనియర్ దాకా ఏ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఎఫ్1, జురాసిక్ వరల్డ్ రీ బర్త్, సూపర్ మ్యాన్ లాంటి హాలీవుడ్ మూవీస్ సొమ్ములు చేసుకున్నాయి. ఆఖరికి సైయారాకు సైతం మంచి నెంబర్లు కనిపించడానికి కారణం ఇదే. ఇప్పుడు హరిహర వీరమల్లు కనక సాలిడ్ హిట్టు కొడితే థియేటర్లు మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతాయి.
This post was last modified on July 19, 2025 5:29 pm
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…