కూలీతో విపరీతమైన పోటీ ఎదురుకుంటున్న వార్ 2 ప్రచారంలో అసలైన ఘట్టం రానుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ బృందం ట్రైలర్ ని సిద్ధం చేసింది. ముంబై రిపోర్ట్స్ ప్రకారం 2 నిమిషాల 39 సెకండ్ల హై వోల్టేజ్ వీడియో కంటెంట్ తో యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది. యాక్షన్ విజువల్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయని, రక్తపాతం ఓ రేంజ్ లో ఉందని యష్ రాజ్ బృందం నుంచి వినిపిస్తున్న మాట. వచ్చే నెల మొదటి వారం లాంఛ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూలీ ట్రైలర్ ఆగస్ట్ 2 వస్తున్న నేపథ్యంలో దానికన్నా ముందా లేక తర్వాత వదలాలా అనే దాని గురించి తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా యష్ రాజ్ ఫిలింస్ తాజాగా విడుదల చేసిన సయారా ఆశించిన దాని కన్నా పెద్ద ఎత్తున స్పందన దక్కించుకుంటున్న నేపథ్యంలో దాంతో పాటు వార్ 2 ట్రైలర్ ని స్క్రీనింగ్ చేసి ఉంటే బాగుండేదని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. టీజర్ కు నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది కాబట్టి దాన్ని ప్లే చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడుతున్నారు. పోనీ హరిహర వీరమల్లుతో అటాచ్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతున్నారు. బిజినెస్ డీల్స్ మరింత పెరిగేందుకు ట్రైలర్ పోషించే పాత్ర కీలకం. డిస్ట్రిబ్యూటర్లను లాక్ చేసినా ఇంకా ఏరియాల వారిగా అమ్మకాలు పూర్తవ్వలేదు.
ముందైతే ట్రైలర్ కు సంబంధించిన ప్రోమో వచ్చే వారం వదులుతారు. పూర్తి స్థాయి ప్రమోషన్లు ఎప్పటి నుంచి మొదలు పెడతారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ముంబై, హైదరాబాద్, కోచి, చెన్నై, బెంగళూరు నగరాల్లో ప్రెస్ మీట్లు ప్లాన్ చేస్తున్నారు. రెండు చోట్ల పూర్తి స్థాయి వేడుకలు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి కాకుండా విడివిడిగా వీటిలో పాల్గొనేలా నిర్మాత ఆదిత్య చోప్రా వెరైటీ స్ట్రాటజీ ప్లాన్ చేశారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన వార్ 2 లో తారక్, హృతిక్ మధ్య ఫేస్ ఆఫ్ మీదే ఎక్కువ అంచనాలున్నాయి.
This post was last modified on July 18, 2025 5:32 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…