బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? పదేళ్ల కిందట భారతీయ ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేసిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండేళ్లు ఎదురు చూశారు. 2017 ఏప్రిల్ 28 ఆ ప్రశ్నకు జవాబు తెలిసింది. ఈ ప్రశ్నే బాహుబలి-2కు పెద్ద ప్రమోషన్ మెటీరియల్గా మారింది. ఐతే ఇప్పుడు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీం మళ్లీ ప్రమోషన్లు మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రమోషన్లో ప్రభాస్, రానా దగ్గుబాలి సైతం భాగం అవుతుండడం విశేషం. ‘‘బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే’’.. అంటూ ‘బాహుబలి’ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్టు పెట్టారు. దానికి రానా బదులిస్తూ.. ‘‘నేను అతణ్ని చంపేసేవాడిని’’ అని పేర్కొన్నాడు. దీనికి తర్వాత ప్రభాస్ సైతం రిప్లై ఇవ్వడం విశేషం. ‘బాహుబలి-2’ వెయ్యి కోట్ల పోస్టర్ను షేర్ చేస్తూ.. ‘‘దీని కోసం అలా జరగనిచ్చేవాడిని భల్లా’’ అని ప్రభాస్ పేర్కొన్నాడు. ఈ కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బాహుబలి’ రీ రిలీజ్కు సైతం ఈ రేంజిలో ప్రమోషన్లు చేయడం చూస్తుంటే.. ఇది మళ్లీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
‘బాహుబలి’ రెండు భాగాల నిడివి ఐదున్నర గంటలకు పైగానే కాగా.. ఇప్పుడు దాన్ని మూడున్నర, నాలుగు గంటల మధ్య నిడివితో ఒకటిగా రిలీజ్ చేయబోతున్నారు. రెండు భాగాల నుంచి ఎడిట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు రీ రిలీజ్లో చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి కూడా తోడవుతున్నాయంటే.. రెండు భాగాల నుంచి చాలా సీన్లతో పాటు పాటలు లేపేయాల్సి ఉంటుంది. ఈ ఎడిటింగ్ పనులను రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. అక్టోబరులో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. దానికి ముందు ట్రైలర్ కూడా ఒకటి వదలబోతున్నారు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…