బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? పదేళ్ల కిందట భారతీయ ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేసిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండేళ్లు ఎదురు చూశారు. 2017 ఏప్రిల్ 28 ఆ ప్రశ్నకు జవాబు తెలిసింది. ఈ ప్రశ్నే బాహుబలి-2కు పెద్ద ప్రమోషన్ మెటీరియల్గా మారింది. ఐతే ఇప్పుడు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీం మళ్లీ ప్రమోషన్లు మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రమోషన్లో ప్రభాస్, రానా దగ్గుబాలి సైతం భాగం అవుతుండడం విశేషం. ‘‘బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే’’.. అంటూ ‘బాహుబలి’ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్టు పెట్టారు. దానికి రానా బదులిస్తూ.. ‘‘నేను అతణ్ని చంపేసేవాడిని’’ అని పేర్కొన్నాడు. దీనికి తర్వాత ప్రభాస్ సైతం రిప్లై ఇవ్వడం విశేషం. ‘బాహుబలి-2’ వెయ్యి కోట్ల పోస్టర్ను షేర్ చేస్తూ.. ‘‘దీని కోసం అలా జరగనిచ్చేవాడిని భల్లా’’ అని ప్రభాస్ పేర్కొన్నాడు. ఈ కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బాహుబలి’ రీ రిలీజ్కు సైతం ఈ రేంజిలో ప్రమోషన్లు చేయడం చూస్తుంటే.. ఇది మళ్లీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
‘బాహుబలి’ రెండు భాగాల నిడివి ఐదున్నర గంటలకు పైగానే కాగా.. ఇప్పుడు దాన్ని మూడున్నర, నాలుగు గంటల మధ్య నిడివితో ఒకటిగా రిలీజ్ చేయబోతున్నారు. రెండు భాగాల నుంచి ఎడిట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు రీ రిలీజ్లో చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి కూడా తోడవుతున్నాయంటే.. రెండు భాగాల నుంచి చాలా సీన్లతో పాటు పాటలు లేపేయాల్సి ఉంటుంది. ఈ ఎడిటింగ్ పనులను రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. అక్టోబరులో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. దానికి ముందు ట్రైలర్ కూడా ఒకటి వదలబోతున్నారు.
This post was last modified on July 17, 2025 10:35 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…