ఈ ఏడాది థియేటర్ల దగ్గర జనాల జాతర తీసుకొచ్చిన సినిమా అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చెప్పాలి. సంక్రాంతి పండక్కి రిలీజైన ఈ చిత్రం అలా ఇలా ఆడలేదు. పోటీలో ఉన్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లాంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి ఇది లీడర్గా మారింది. జనం విరగబడి చూశారీ చిత్రాన్ని. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లతో ఔరా అనిపించింది. ఐతే జనం ఇంతగా కనెక్ట్ అయి బ్లాక్ బస్టర్ చేసిన సినిమాకు రిలీజ్ ముంగిట ఓటీటీ డీల్ జరగలేదట. ఈ విషయాన్ని వెంకటేష్ అన్న కొడుకు, నటుడు దగ్గుబాటి రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
థియేటర్లకు వచ్చే జనం అంతకంతకూ తగ్గిపోతుండడం.. దీనికి అర్లీ ఓటీటీ డీల్స్ కారణం అవుతుండడం గురించి ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడాడు. తన బాబాయి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’కు రిలీజ్ ముంగిట డిజిటల్ డీల్ జరగలేదని ఈ సందర్భంగా రానా వెల్లడించాడు. అయినా అలాగే సినిమాను రిలీజ్ చేశారని.. జనం ఎగబడి చూశారని.. ప్రేక్షకుల్లో థియేటర్లకు వచ్చి సినిమా చూడడానికి ఇంత ఆసక్తి ఉందా అనిపించేలా ఈ చిత్రం ఆడిందని రానా తెలిపాడు. ఇప్పటికే సినిమాల కోసం థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని.. వాళ్లను రప్పించే సినిమా తీయడం ముఖ్యమని రానా తెలిపాడు.
ఈ సందర్భంగా రానా ఐఎండీబీలో తన టాప్-5 బెస్ట్ వాచ్ లిస్ట్ కూడా చెప్పాడు. ‘స్టార్ వార్స్’ తన ఆల్ టైం ఫేవరెట్ అని రానా చెప్పాడు. మణిరత్నం-కమల్ హాసన్ల ‘నాయగన్’కు రానా సెకండ్ ప్లేస్ ఇచ్చాడు. ఇక హాలీవుడ్ మూవీ ‘స్టార్ ఫేస్’ను తాను అదే పనిగా చూస్తూ ఉంటానని రానా తెలిపాడు. ఇంకా గ్లాడియేటర్, లాక్ స్టాక్ అండ్ టు స్మోకింగ్ బారెల్స్ తనకు ఆల్ టైం ఫేవరెట్ సినిమాలని రానా తెలిపాడు.
This post was last modified on July 17, 2025 6:51 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…