ఈ ఏడాది థియేటర్ల దగ్గర జనాల జాతర తీసుకొచ్చిన సినిమా అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చెప్పాలి. సంక్రాంతి పండక్కి రిలీజైన ఈ చిత్రం అలా ఇలా ఆడలేదు. పోటీలో ఉన్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లాంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి ఇది లీడర్గా మారింది. జనం విరగబడి చూశారీ చిత్రాన్ని. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లతో ఔరా అనిపించింది. ఐతే జనం ఇంతగా కనెక్ట్ అయి బ్లాక్ బస్టర్ చేసిన సినిమాకు రిలీజ్ ముంగిట ఓటీటీ డీల్ జరగలేదట. ఈ విషయాన్ని వెంకటేష్ అన్న కొడుకు, నటుడు దగ్గుబాటి రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
థియేటర్లకు వచ్చే జనం అంతకంతకూ తగ్గిపోతుండడం.. దీనికి అర్లీ ఓటీటీ డీల్స్ కారణం అవుతుండడం గురించి ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడాడు. తన బాబాయి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’కు రిలీజ్ ముంగిట డిజిటల్ డీల్ జరగలేదని ఈ సందర్భంగా రానా వెల్లడించాడు. అయినా అలాగే సినిమాను రిలీజ్ చేశారని.. జనం ఎగబడి చూశారని.. ప్రేక్షకుల్లో థియేటర్లకు వచ్చి సినిమా చూడడానికి ఇంత ఆసక్తి ఉందా అనిపించేలా ఈ చిత్రం ఆడిందని రానా తెలిపాడు. ఇప్పటికే సినిమాల కోసం థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని.. వాళ్లను రప్పించే సినిమా తీయడం ముఖ్యమని రానా తెలిపాడు.
ఈ సందర్భంగా రానా ఐఎండీబీలో తన టాప్-5 బెస్ట్ వాచ్ లిస్ట్ కూడా చెప్పాడు. ‘స్టార్ వార్స్’ తన ఆల్ టైం ఫేవరెట్ అని రానా చెప్పాడు. మణిరత్నం-కమల్ హాసన్ల ‘నాయగన్’కు రానా సెకండ్ ప్లేస్ ఇచ్చాడు. ఇక హాలీవుడ్ మూవీ ‘స్టార్ ఫేస్’ను తాను అదే పనిగా చూస్తూ ఉంటానని రానా తెలిపాడు. ఇంకా గ్లాడియేటర్, లాక్ స్టాక్ అండ్ టు స్మోకింగ్ బారెల్స్ తనకు ఆల్ టైం ఫేవరెట్ సినిమాలని రానా తెలిపాడు.
This post was last modified on July 17, 2025 6:51 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…