ఆర్ఆర్ఆర్.. పగలూ రాత్రీ తేడా లేకుండా
ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’యే. ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. ఈపాటికి సినిమా విడుదల కావడమో లేదా విడుదలకు చేరువగా ఉండటమో జరగాల్సింది. కానీ అనుకున్న ప్రణాళికలు ఫలించలేదు. ఒకసారి సినిమాను వాయిదా వేసి 2021 సంక్రాంతికి ఫిక్స్ చేసినప్పటికీ.. కరోనా ఈ ప్లాన్లను దెబ్బ కొట్టేసింది.
ఒకసారి సినిమా మొదలుపెట్టాక విరామం లేకుండా పని చేసే రాజమౌళి.. కరోనా ధాటికి ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆరేడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు గత నెలలో ఆయన ‘ఆర్ఆర్ఆర్’ పని పున:ప్రారంభించారు. మధ్యలో టీజర్ కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న రాజమౌళి బృందం.. మళ్లీ విరామం లేకుండా పని చేస్తోంది. పగలూ రాత్రీ తేడా లేకుండా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ సాగుతుండటం గమనార్హం. విపరీతమైన చలిలో, ఇబ్బందికర పరిస్థితుల్లో షూటింగ్ చేస్తోంది జక్కన్న బృందం.
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ పేజీలో ఒక వీడియోను షేర్ చేశారు. అది ‘ఆర్ఆర్ఆర్’ ఆన్ లొకేషన్ది కావడం విశేషం. చిత్ర బృందంలోని వాళ్లందరూ చలికి వణికిపోతూ లొకేషన్లో పెట్టిన మంట దగ్గర చలికాచుకుంటుండటం అందులో కనిపిస్తోంది. రేపు నీళ్లలో కూడా దిగబోతున్నామంటూ రాజమౌళి తన టీంను మరింత కష్టపెట్టబోతున్న విషయాన్ని వెల్లడించాడు.
రాజమౌళి రంగంలోకి దిగాడంటే పని రాక్షసుడిగా మారిపోతాడని, అసలు కనికరం ఉండదని అంటారు. కరోనా వల్ల ప్రొడక్షన్ పరంగానే కాక అన్ని రకాలుగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో జక్కన్న ఇప్పుడు మరింత కఠినంగా మారిపోయి తన టీంను కష్టపెడుతున్నాడట. సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అంచనాలు ప్రకారం చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ 2021 ద్వితీయార్ధంలో కానీ విడుదలయ్యే అవకాశం లేదు. 2020 జులై 30కి అనుకున్న ఈ చిత్రం.. తర్వాతి ఏడాది ఆ తేదీకి వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే ఆగస్టు 15 అదీ కుదరదంటే దసరాకు సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు.
This post was last modified on November 17, 2020 2:27 pm
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…