Movie News

లోకేష్ కనకరాజ్‌కు సంజయ్ దత్ ఫోన్

బ్లాక్ బస్టర్‌ మూవీ ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘లియో’ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అందులో హీరో సహా చాలా పాత్రలు తేలిపోయాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పాత్ర సైతం హాఫ్ బేక్డ్ అనిపించింది. ఈ విషయంలో సంజయ్ దత్ సైతం అసంతృప్తితో ఉన్న విషయం ఇటీవలే వెల్లడైంది. ‘కేడీ: ది డెవిల్’ అనే కన్నడ అనువాద చిత్రం ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ‘లియో’లో తన పాత్రను వేస్ట్ అయిందని.. ఈ విషయంలో దర్శకుడు లోెకేష్ కనకరాజ్ మీద కోపంగా ఉన్నానని సంజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

సంజయ్ దత్ సరదాగానే ఈ మాట అన్నట్లు కనిపించినా.. మీడియాలో ఆ విషయం బ్లో అప్ అయిపోయింది. ఇదే విషయమై ‘కూలీ’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ స్పందించాడు. ఈ కామెంట్స్ తర్వాత సంజయ్ దత్ తనకు కాల్ చేసి మాట్లాడినట్లు లోకేష్ వెల్లడించాడు. తాను సరదాగానే ఆ కామెంట్ చేశానని.. కానీ సోషల్ మీడియాలో జనాలు మరో రకంగా స్పందించారని సంజు తనతో చెప్పినట్లు లోకేష్ తెలిపాడు.

తానేమీ జీనియస్ డైరెక్టర్‌ను కానని.. తప్పులు జరుగుతాయని.. వాటి నుంచి నేర్చుకునే దశలోనే ఉన్నానని లోకేష్ తెలిపాడు. భవిష్యత్తులో సంజయ్ దత్‌ను మంచి పాత్రలో చూపించడానికి ప్రయత్నిస్తానని లోకేష్ అన్నాడు. ఇక ‘కూలీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. దీన్ని రజినీకాంత్ ‘దళపతి’తో పోల్చినట్లు లోకేష్ తెలిపాడు. ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందా అని అడిగితే.. కలెక్షన్ల కంటే ప్రేక్షకుడు టికెట్ మీద పెట్టే 150 రూపాయల మీదే తన ఫోకస్ ఉంటుందని.. ఆ డబ్బులకు న్యాయం చేసే సినిమా ఇదని లోకేష్ అన్నాడు. ‘లియో’ సినిమా 600 కోట్లు వసూలు చేయడం వల్ల ‘కూలీ’కి తన పారితోషకం రెట్టింపు అయి రూ.50 కోట్లకు చేరిందని అతను చెప్పడం విశేషం.

This post was last modified on July 15, 2025 2:18 pm

Share

Recent Posts

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…

1 hour ago

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

3 hours ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

4 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

9 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

11 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

11 hours ago