బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘లియో’ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అందులో హీరో సహా చాలా పాత్రలు తేలిపోయాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పాత్ర సైతం హాఫ్ బేక్డ్ అనిపించింది. ఈ విషయంలో సంజయ్ దత్ సైతం అసంతృప్తితో ఉన్న విషయం ఇటీవలే వెల్లడైంది. ‘కేడీ: ది డెవిల్’ అనే కన్నడ అనువాద చిత్రం ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ‘లియో’లో తన పాత్రను వేస్ట్ అయిందని.. ఈ విషయంలో దర్శకుడు లోెకేష్ కనకరాజ్ మీద కోపంగా ఉన్నానని సంజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
సంజయ్ దత్ సరదాగానే ఈ మాట అన్నట్లు కనిపించినా.. మీడియాలో ఆ విషయం బ్లో అప్ అయిపోయింది. ఇదే విషయమై ‘కూలీ’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ స్పందించాడు. ఈ కామెంట్స్ తర్వాత సంజయ్ దత్ తనకు కాల్ చేసి మాట్లాడినట్లు లోకేష్ వెల్లడించాడు. తాను సరదాగానే ఆ కామెంట్ చేశానని.. కానీ సోషల్ మీడియాలో జనాలు మరో రకంగా స్పందించారని సంజు తనతో చెప్పినట్లు లోకేష్ తెలిపాడు.
తానేమీ జీనియస్ డైరెక్టర్ను కానని.. తప్పులు జరుగుతాయని.. వాటి నుంచి నేర్చుకునే దశలోనే ఉన్నానని లోకేష్ తెలిపాడు. భవిష్యత్తులో సంజయ్ దత్ను మంచి పాత్రలో చూపించడానికి ప్రయత్నిస్తానని లోకేష్ అన్నాడు. ఇక ‘కూలీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. దీన్ని రజినీకాంత్ ‘దళపతి’తో పోల్చినట్లు లోకేష్ తెలిపాడు. ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందా అని అడిగితే.. కలెక్షన్ల కంటే ప్రేక్షకుడు టికెట్ మీద పెట్టే 150 రూపాయల మీదే తన ఫోకస్ ఉంటుందని.. ఆ డబ్బులకు న్యాయం చేసే సినిమా ఇదని లోకేష్ అన్నాడు. ‘లియో’ సినిమా 600 కోట్లు వసూలు చేయడం వల్ల ‘కూలీ’కి తన పారితోషకం రెట్టింపు అయి రూ.50 కోట్లకు చేరిందని అతను చెప్పడం విశేషం.
This post was last modified on July 15, 2025 2:18 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…