బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘లియో’ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అందులో హీరో సహా చాలా పాత్రలు తేలిపోయాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పాత్ర సైతం హాఫ్ బేక్డ్ అనిపించింది. ఈ విషయంలో సంజయ్ దత్ సైతం అసంతృప్తితో ఉన్న విషయం ఇటీవలే వెల్లడైంది. ‘కేడీ: ది డెవిల్’ అనే కన్నడ అనువాద చిత్రం ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ‘లియో’లో తన పాత్రను వేస్ట్ అయిందని.. ఈ విషయంలో దర్శకుడు లోెకేష్ కనకరాజ్ మీద కోపంగా ఉన్నానని సంజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
సంజయ్ దత్ సరదాగానే ఈ మాట అన్నట్లు కనిపించినా.. మీడియాలో ఆ విషయం బ్లో అప్ అయిపోయింది. ఇదే విషయమై ‘కూలీ’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ స్పందించాడు. ఈ కామెంట్స్ తర్వాత సంజయ్ దత్ తనకు కాల్ చేసి మాట్లాడినట్లు లోకేష్ వెల్లడించాడు. తాను సరదాగానే ఆ కామెంట్ చేశానని.. కానీ సోషల్ మీడియాలో జనాలు మరో రకంగా స్పందించారని సంజు తనతో చెప్పినట్లు లోకేష్ తెలిపాడు.
తానేమీ జీనియస్ డైరెక్టర్ను కానని.. తప్పులు జరుగుతాయని.. వాటి నుంచి నేర్చుకునే దశలోనే ఉన్నానని లోకేష్ తెలిపాడు. భవిష్యత్తులో సంజయ్ దత్ను మంచి పాత్రలో చూపించడానికి ప్రయత్నిస్తానని లోకేష్ అన్నాడు. ఇక ‘కూలీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. దీన్ని రజినీకాంత్ ‘దళపతి’తో పోల్చినట్లు లోకేష్ తెలిపాడు. ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందా అని అడిగితే.. కలెక్షన్ల కంటే ప్రేక్షకుడు టికెట్ మీద పెట్టే 150 రూపాయల మీదే తన ఫోకస్ ఉంటుందని.. ఆ డబ్బులకు న్యాయం చేసే సినిమా ఇదని లోకేష్ అన్నాడు. ‘లియో’ సినిమా 600 కోట్లు వసూలు చేయడం వల్ల ‘కూలీ’కి తన పారితోషకం రెట్టింపు అయి రూ.50 కోట్లకు చేరిందని అతను చెప్పడం విశేషం.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…