ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి లేదని ఫీలవుతున్న ప్రేక్షకులకు రాబోయే నాలుగైదు నెలల్లో రాబోయే చిత్రాలు బాగానే లోటును భర్తీ చేసేలా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్లకు చెందిన పలు చిత్రాలు చివరి నాలుగైదు నెలల్లో రాబోతున్నాయి. ఇంకో 10 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ రాబోతోంది. తర్వాత ఆగస్టులో ‘వార్-2;’ ‘కూలీ’ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఆ తర్వాత సెప్టెంబరుకు రెండు మూడు భారీ చిత్రాలే షెడ్యూల్ అయి ఉన్నాయి. ఐతే వాటిలో ‘ఓజీ’ మాత్రమే చెప్పిన డేటుకు వచ్చేలా ఉంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’తో పోటీ పడాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడడం గ్యారెంటీ అన్నది తాజా సమాచారం.
ఇప్పటిదాకా వాయిదా అంటూ అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా.. గత నెలలో రిలీజ్ చేసిన టీజర్లో కూడా అదే డేట్ ప్రకటించినా… యూనిట్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం సినిమా పోస్ట్ పోన్ కానుందట. ‘అఖండ-2’ చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. కొంత టాకీ పార్ట్, పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ప్రయాగలో అనుకున్న చివరి షెడ్యూల్ వర్షాల వల్ల క్యాన్సిల్ అయింది. దీంతో చిత్రీకరణ కొంత ఆలస్యం కానుంది. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పనులకు చాలా రోజులే పడుతుందట.
మరోవైపు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గట్టిగా ప్రమోట్ చేసి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే సెప్టెంబరు రిలీజ్ అంటే హడావుడి అవుతుంది. అందుకే డిసెంబరు మీదకి ఫోకస్ షిఫ్ట్ అయినట్లు సమాచారం. ‘అఖండ’ సైతం డిసెంబరులోనే రిలీజైన సంగతి గమనార్హం. ప్రస్తుతానికి డిసెంబరు 18 అనుకుంటున్నారట. త్వరలోనే డేట్ ఖరారు చేసి, మీడియాకు అధికారికంగా అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆది పినిశెట్టి విలన్గా కనిపించనున్నాడు.
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…