లేటు వయసులో మంచి స్పీడుతో సినిమాలు చేసుకుపోతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. గత ఏడాది అక్టోబరులో ‘వేట్టయాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. వచ్చే నెలలో ‘కూలీ’తో పలకరించబోతున్నారు. ఆయన తర్వాతి చిత్రం ఇప్పటికే చిత్రీకరణ దశలోకి వెళ్లింది. అదే.. జైలర్-2. ఇది వచ్చే వేసవికి రిలీజయ్యే అవకాశముంది. ఇంతలోనే ఆయన తర్వాతి సినిమా గురించి కబురు వినిపిస్తోంది. ఈసారి ఆయన ఒక అప్కమింగ్ డైరెక్టర్తో జట్టు కట్టబోతున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఆ దర్శకుడే.. నిథిలన్ స్వామినాథన్.
గత ఏడాది బ్లాక్ బస్టర్ అయిన ‘మహారాజా’ సినిమాతో నిథిలన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తమిళంలో ఈ మధ్య కాలంలో అతి పెద్ద సెన్సేషన్గా ఈ సినిమాను చెప్పాలి. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక కమర్షియల్గానూ గొప్ప విజయం సాధించింది. ఒక కొత్త తమిళ దర్శకుడు తన తొలి చిత్రంలో ఇంత ప్రతిభ చూపించడం ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పాలి. ‘మహారాజా’ చైనాలో రిలీజ్ చేస్తే అక్కడా మంచి వసూళ్లు సాధించడం విశేషం. ప్రస్తుతం నిథిలన్ ‘మహారాజా-2’ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే అది సెట్స్ మీదికి వెళ్లనుంది.
దీని తర్వాత నిథిలన్ సూపర్ స్టార్తో జట్టు కట్టబోతున్నాడట. నిథిలన్ చెప్పిన ఒక లైన్ నచ్చి సినిమా చేయడానికి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రజినీ, నిథిలన్ తమ తర్వాతి చిత్రాలను పూర్తి చేశాక వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో కలిసి సినిమాను మొదలుపెట్టే అవకాశముంది. ఐతే రజినీకి మాస్, కమర్షియల్ దర్శకులే కరెక్ట్ అనే అభిప్రాయం ఉంది. ‘జై భీమ్’ లాంటి భిన్నమైన సినిమా తీసిన జ్ఞానవేల్.. రజినీతో చేసిన ‘వేట్టయాన్’తో నిరాశపరిచాడు. మరి నిథిలన్ అయినా రజినీతో కమర్షియల్ హిట్ కొడతాడేమో చూడాలి.
This post was last modified on July 14, 2025 4:29 pm
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…