కోట శ్రీనివాసరావు ఎంత గొప్ప నటుడో తెలుగు వాళ్లకు తెలియంది కాదు. వాళ్లకు కొత్తగా ఈ విషయం గుర్తు చేయాల్సిన పని లేదు. తెలుగు సినిమాల్లో ఆయన అద్భుత నటనకు తార్కాణంగా నిలిచే పాత్రలు కోకొల్లలు. ఐతే మన వాళ్ల ప్రతిభను మనం పొగుడుకుంటే గొప్పేముంది? ఇతర భాషల వాళ్లు కొనియాడితే అది చాలా స్పెషల్. అందులోనూ తామే గొప్ప అనుకునే తమిళులు.. మన నటుడి ప్రత్యేకతను గుర్తించి ప్రశంసలు కురిపిస్తే అది మనకూ గర్వకారణమే. కోట శ్రీనివాసరావు ఈ గౌరవాన్నే పొందారు. తమిళంలో ఆయన 20 సినిమాలకు పైగానే నటించారు. పరభాషా నటులకు పెద్దగా అవకాశాలు ఇవ్వని తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు.
కోట ప్రతిభకు తమిళ ఫిలిం మేకర్స్, ప్రేక్షకులు అంతగా ఫిదా అయ్యారు కాబట్టే ఆయనకు అక్కడ అన్ని అవకాశాలు దక్కాయి. ఆయన ప్రతిభను తమిళులకు పరిచయం చేసిన సినిమా.. సామి. తెలుగులోకి ‘లక్ష్మీ నరసింహ’ పేరుతో రీమేక్ అయిన చిత్రమే.. సామి. ఇక్కడ బాలయ్య హీరోగా నటిస్తే ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించారు. ఒరిజినల్లో లీడ్ రోల్లో విక్రమ్ నటిస్తే.. విలన్ పాత్రను కోట చేశారు. తమిళంలో ‘నరసింహ’ పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ అయిన సినిమా.. సామి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడంలో హీరోగా విక్రమ్ పెర్ఫామెన్స్ ఎంత కీలకమో.. కోట విలనీది కూడా అంతే ముఖ్య పాత్ర.
పెరుమాళ్ పిచ్చాయ్ అనే విలక్షణ పాత్రలో కోట అద్భుతంగా నటించాడు. తమిళంలో ఒక మూసలో సాగిపోతున్న విలన్ పాత్రలకు, నటనకు ఒక వైవిధ్యం తీసుకొచ్చారు కోట. ఆయన పెర్ఫామెన్సుకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమాకు కోటకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గాత్రదానం చేశారు. ఈ సినిమా తర్వాత తమిళంలో ఆయనకు అవకాశాలు వరుస కట్టాయి. విజయ్తో ‘తిరుపాచ్చి’, విశాల్తో ‘సెల్యూట్’, జీవాతో ‘కో’ (తెలుగులో రంగం), కార్తితో ‘శకుని’, విక్రమ్తో మరోసారి ‘తాండవం’, ‘సామి-2’.. ఇలా చాలా సినిమాలే చేశారాయన. ఆయా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. కోట నటనకు మాత్రం ప్రతిసారీ ప్రశంసలు దక్కాయి. తమిళంలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు నటుల్లో కోట పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on July 13, 2025 2:14 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…