సినిమాల్లో స్టైల్, స్వాగ్ తో కట్టిపడేసే సూపర్ స్టార్ రజనీకాంత్ సరైన సందర్భం దొరకాలే కానీ తనలో కామెడీ టైమింగ్ ని బ్రహ్మాండంగా బయటికి తీస్తారు. ఇటీవలే చెన్నైలో జరిగిన వేల్పరి లక్ష కాపీల ఈవెంట్ లో ఆయనన్న మాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆ మధ్య ఒక వేడుకలో తాను అన్న మాటలు కొంత వివాదానికి దారి తీశాయని, ఇలాంటి సభలకు కమల్ హాసన్ లేదా శివ కుమార్ (సూర్య తండ్రి) లాంటి వాళ్ళను పిలవాలి కానీ 75 ఏళ్ళ వయసులో స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చే తనను ఎందుకు ఆహ్వానించారని చెప్పడంతో ఒక్కసారిగా ఘొల్లుమనడం ఆహుతుల వంతయ్యింది.
తన తోటి నటీనటులను మేధావులుగా పేర్కొనడం రజనికే చెల్లింది. ఇకపై తొందరపడనని ఆచితూచి మాట్లాడతానని చెప్పడం సంస్కారానికి నిదర్శనం. వేల్పరి నవలను పాతిక శాతం పూర్తి చేశానని చెప్పిన తలైవర్ మిగిలింది రెటైర్ మెంట్ తర్వాత చదువుతానని చెప్పడం కొసమెరుపు. ఈ వేల్పరినే దర్శకుడు శంకర్ వెయ్యి కోట్ల బడ్జెట్ తో మూడు భాగాలుగా తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ ఫలితాల వల్ల ఇప్పుడే నిర్మాత ఆయన మీద అంత ఖర్చు పెట్టేందుకు సాహసించడు. ఒకవేళ రజని కమల్ లాంటి హీరోలు ఒప్పుకుంటే ఛాన్స్ ఉందేమో కానీ ఈ కాంబో సాధ్యం కాదు.
ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలి కోసం రజని అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. జైలర్ రికార్డులను డబుల్ మార్జిన్ తో బద్దలు కొడతారని నమ్మకంతో ఉన్నారు. వార్ 2 తో క్లాష్ ఉన్నప్పటికీ కూలి క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. తెలుగు హక్కులే యాభై కోట్లకు పైగా అమ్ముడుపోవడమే దానికి నిదర్శనం. కూలి పూర్తి కావడం ఆలస్యం జైలర్ 2లో బిజీగా మారిపోయిన రజనీకాంత్ ఆ తర్వాత చేయబోయే సినిమా దర్శకులను ఇంకా లాక్ చేయలేదు. కథా చర్చలైతే జరుగుతున్నాయి కానీ నెక్స్ట్ ఎవరితో అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on July 13, 2025 10:51 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…