టాలీవుడ్ కు ఇదో చీకటి రోజు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్ను మూశారు. 750కి పైగా సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించి శాశ్వత విశ్రాంతి కోసం స్వర్గానికి వెళ్లిపోయారు. 83 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అందుకోని మైలురాళ్లు లేవు. 1942 జూలై 10 జన్మించిన కోట స్వస్థలం కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామం. 1978లో చిరంజీవితో పాటు ప్రాణం ఖరీదుతో తెరంగేట్రం చేశారు. చిన్నప్పటి నుంచే నాటకాల మీద విపరీతమైన మక్కువ చూపించిన కోట తాను గొప్ప యాక్టరవుతానని ఏనాడూ అనుకోలేదు. తొలి చిత్రం తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కొన్నేళ్లు బ్యాంకు ఉద్యోగంలో కొనసాగారు.
1985లో దర్శకులు టి కృష్ణ నుంచి పిలుపు రావడం ఆయన కెరీర్ లో మేలి మలుపు. వందేమాతరంలో వేసింది చిన్న వేషమే అయినా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఉషాకిరణ్ మూవీస్ ప్రతిఘటనలో చేసిన కాశయ్య క్యారెక్టర్ ఒకేసారి పది మెట్లు పైకి ఎక్కించేసింది. వరస ఆఫర్లు రావడంతో హైదరాబాద్ నారాయణగూడలో చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి మదరాసు వచ్చేశారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అహ నా పెళ్ళంట, యముడికి మొగుడు, శత్రువు, బావ బావమరిది, మామగారు, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆమె లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో కీలక భూమికలు పోషించారు.
కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర ఇచ్చినా తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో మెప్పించడం కోటకే చెల్లింది. హలో బ్రదర్ లో హాస్యంతో నవ్వించే పోలీస్ గా, గణేష్ లో ప్రాణాలు తీసే క్రూరమైన మినిస్టర్ గా ఒకేసారి ప్రశంసలు అందుకోవడం కోటకు మాత్రమే సాధ్యం. అయిదుసార్లు నంది అవార్డు దక్కించుకున్న కోట శ్రీనివాసరావుకు 2015లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 1999లో విజయవాడ తూర్పు బీజీపీ ఎంఎల్ఏగా కోట రాజకీయాల్లోనూ సేవలు అందించారు. మూడు తరాల నటులతో కలిసి పని చేసిన సమున్నత నట శిఖరం కోట శ్రీనివాసరావు లేకపోవడం పరిశ్రమకు తీరని లోటు.
This post was last modified on July 13, 2025 9:42 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…