సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం ‘కూలీ’ ఆరంభమైన దగ్గర్నుంచే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ హైప్ ఇంకా ఇంకా పెరుగుతోంది. ఓవైపు రజినీకాంత్.. ఇంకోవైపు అక్కినేని నాగార్జున.. మరోవైపు ఉపేంద్ర.. ఇలాంటి కాస్టింగ్తో సినిమా రావడం అరుదు. వారి వారి అభిమానులు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే వీరిలా పెద్ద స్టార్ కాకపోయినా.. పెర్ఫామెన్స్లో ఆ ముగ్గురినీ డామినేట్ చేయగల నటుడు ఒకరు ఈ సినిమాలో ఉన్నాడు. అతనే.. సౌబిన్ షాహిర్.
ఇప్పుడు అందరూ రజినీ, నాగ్, ఉపేంద్రల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ.. ‘కూలీ’ రిలీజ్ తర్వాత సౌబిన్ షాహిర్ గురించే ఎక్కువగా చర్చించుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. అతను అలాంటి పెర్ఫామర్ మరి. తన టాలెంట్ ఏంటో అతను ఇంతకుముందు నటించిన కొన్ని చిత్రాలను ఓసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, ఎళ వీళ పూంచిర, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు చూసిన వాళ్లు సౌబిన్ నటనను అంత సులువుగా మరిచిపోలేరు. ముఖ్యంగా కుంబలంగి నైట్స్, ఎళ వీళ పూంచిర లాంటి సినిమాల్లో సౌబిన్ పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
మన కలర్స్ స్వాతి ‘కుంబలంగి నైట్స్’లో ఒక సింపుల్ సీన్లో సౌబిన్ నటన గురించి అబ్బురపడుతూ ఒక వీడియో కూడా చేసింది. ఎక్కువ హడావుడి చేయకుండా సటిల్గా నటిస్తూ ప్రేక్షకులను కట్టి పడేస్తాడు సౌబిన్. ఫాహద్ ఫాజిల్ తర్వాత కొత్తతరం నటుల్లో అంత గుర్తింపు సంపాదించాడు సౌబిన్. లుక్స్ పరంగా యావరేజ్ అనిపిస్తాడు కానీ.. నటనలో మాత్రం అతడికి తిరుగులేదు. అతణ్ని ఏరి కోరి ‘కూలీ’ కోసం ఎంచుకున్న లోకేష్ కనకరాజ్.. తన టాలెంట్కు తగ్గ పవర్ ఫుల్ క్యారెక్టరే ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. తొలిసారి ఇలాంటి భారీ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటించిన సౌబిన్.. అందులో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. ‘కూలీ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…