ఫిలిం సెలబ్రెటీలు పెళ్లి చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం.. చాలా మామూలుగా మారిపోయిన వ్యవహారం. గత కొన్నేళ్లలో పదుల సంఖ్యలో సినీ జంటలు విడిపోయాయి. అందుకే కొత్తగా ఎవరి గురించైనా విడాకుల వార్తలు వస్తే జనం ఏమీ ఆశ్చర్యపోవట్లేదు. కోలీవుడ్లో సెలబ్రేటెడ్ పెయిర్స్లో ఒకటైన నయనతార-విఘ్నేష్ శివన్ జంట విడిపోబోతున్నట్లు రెండు రోజులుగా ఓ వార్త ప్రచారంలోకి వస్తే.. నిజమేనేమో అనుకుంటున్నారు జనం. కానీ ఆ ప్రచారానికి నయనతార స్వయంగా తెరదించేసింది.
తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి దిగిన ఒక లవ్లీ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘మాపై వచ్చే సిల్లీ న్యూస్లను చూసినపుడు మా రియాక్షన్ ఇదే’’ అంటూ అంటూ కామెంట్ చేసింది నయన్. దీంతో ఆమె విడాకుల గురించి వస్తున్న వార్తలకు బ్రేక్ పడిపోయింది. ఇంతకీ నయన్-విఘ్నేష్ విడాకుల గురించి ప్రచారం జరగడానికి కారణమేంటన్నది ప్రశ్న. అందుకు నయన్ ఇటీవలే పెట్టి, డెలీట్ చేసిన ఒక పోస్టే కారణం. ‘‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మీ పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు’’ అంటూ నయన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.
కానీ కొన్ని గంటల్లోనే ఆ పోస్టును ఆమె డెలీట్ చేసింది. ఈలోపే పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి. నయన్, విఘ్నేష్ విడిపోతున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. కానీ నయన్ దీనికి తెరదించేసింది. మరి ఆ పోస్టు ఆమె ఎందుకు పెట్టింది.. ఎందుకు డెలీట్ చేసింది అన్నది సస్పెన్సే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేష్.. 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వారికి ఉయిర్ (ప్రాణం), ఉలగం (లోకం) అని పేర్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం నయన్ తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తూ.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది.
This post was last modified on July 11, 2025 2:34 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…