రాజమౌళి విజువల్ గ్రాండియర్లు, కమర్షియల్ సినిమాలు కాసేపు పక్కనపెడితే తక్కువ బడ్జెట్ తో ఆయన తీసిన బ్లాక్ బస్టర్ మర్యాదరామన్నకు అభిమానుల మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. కమెడియన్ సునీల్ ని హీరోగా పెట్టి అంత పెద్ద హిట్టు కొట్టడమనేది ఎవరూ ఊహించనిది. స్టార్లు వెంటపడుతున్న టైంలో వాళ్ళను కాదని ఒక హాస్యనటుడితో విజయం సాధించడమనేది జక్కన్నకు మాత్రమే సాధ్యమైన ఫీట్. కొన్నేళ్ల పాటు సునీల్ ని మోస్ట్ బిజీ హీరోగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మర్యాదరామన్న పలు భాషల్లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే..
హిందీలో అజయ్ దేవగన్ తో మర్యాద రామన్నని సన్నాఫ్ సర్దార్ గ రీమేక్ చేశారు. నార్త్ లోనూ అదిరిపోయే హిట్టు అనుకుంది. ఇదంతా 2012 నాటి ముచ్చట. పదమూడు సంవత్సరాలు గడిచిపోయాయి. దానికి కొనసాగింపు తెలుగులో చేయలేదు కానీ బాలీవుడ్ లో జరిగిపోయింది. సన్నాఫ్ సర్దార్ 2 వచ్చే వారం జూలై 25 విడుదలకు రెడీ అయిపోయింది. పంజాబ్ ఫ్యాక్షనిస్టుల కుటుంబం నుంచి తప్పించుకున్న సర్దార్ ఇప్పుడు స్కాట్ ల్యాండ్ వెళ్లి అక్కడ ఇంకో ఫ్యామిలీలో చిక్కుకుంటాడు. ఊహించని విధంగా ఆర్మీ ఆఫీసర్ అవతారం ఎత్తుతాడు. ఈసారి రెండో భాగానికి దర్శకుడు మారాడు.
ఇప్పుడీ సన్నాఫ్ సర్దార్ 2లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించింది. హరిహర వీరమల్లుకి కేవలం ఒక్క రోజు గ్యాప్ తో రిలీజవుతున్న ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి పోటీ ఎదురు కానుందో చూడాలి. అయినా మన దగ్గర సాధ్యం కాని మర్యాదరామన్న సీక్వెల్ ఐడియా హిందీలో వర్కౌట్ కావడం విశేషమే. చాలా గ్యాప్ తర్వాత అజయ్ దేవగన్ ఫుల్ లెన్త్ కామెడీ వేషం వేశాడు. ట్రైలర్ చూస్తుంటే జోకులు బాగానే దట్టించారు. అయితే కాన్సెప్ట్ కొంచెం అవుట్ డేటెడ్ గానే అనిపిస్తోంది. మళ్ళీ అదే తరహా హాస్యంతో నవ్వించడం కష్టమే. హౌస్ ఫుల్ 5 లాగా ఏదోలా బండి లాగిస్తుందేమో చూడాలి.
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…