రాజమౌళి విజువల్ గ్రాండియర్లు, కమర్షియల్ సినిమాలు కాసేపు పక్కనపెడితే తక్కువ బడ్జెట్ తో ఆయన తీసిన బ్లాక్ బస్టర్ మర్యాదరామన్నకు అభిమానుల మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. కమెడియన్ సునీల్ ని హీరోగా పెట్టి అంత పెద్ద హిట్టు కొట్టడమనేది ఎవరూ ఊహించనిది. స్టార్లు వెంటపడుతున్న టైంలో వాళ్ళను కాదని ఒక హాస్యనటుడితో విజయం సాధించడమనేది జక్కన్నకు మాత్రమే సాధ్యమైన ఫీట్. కొన్నేళ్ల పాటు సునీల్ ని మోస్ట్ బిజీ హీరోగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మర్యాదరామన్న పలు భాషల్లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే..
హిందీలో అజయ్ దేవగన్ తో మర్యాద రామన్నని సన్నాఫ్ సర్దార్ గ రీమేక్ చేశారు. నార్త్ లోనూ అదిరిపోయే హిట్టు అనుకుంది. ఇదంతా 2012 నాటి ముచ్చట. పదమూడు సంవత్సరాలు గడిచిపోయాయి. దానికి కొనసాగింపు తెలుగులో చేయలేదు కానీ బాలీవుడ్ లో జరిగిపోయింది. సన్నాఫ్ సర్దార్ 2 వచ్చే వారం జూలై 25 విడుదలకు రెడీ అయిపోయింది. పంజాబ్ ఫ్యాక్షనిస్టుల కుటుంబం నుంచి తప్పించుకున్న సర్దార్ ఇప్పుడు స్కాట్ ల్యాండ్ వెళ్లి అక్కడ ఇంకో ఫ్యామిలీలో చిక్కుకుంటాడు. ఊహించని విధంగా ఆర్మీ ఆఫీసర్ అవతారం ఎత్తుతాడు. ఈసారి రెండో భాగానికి దర్శకుడు మారాడు.
ఇప్పుడీ సన్నాఫ్ సర్దార్ 2లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించింది. హరిహర వీరమల్లుకి కేవలం ఒక్క రోజు గ్యాప్ తో రిలీజవుతున్న ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి పోటీ ఎదురు కానుందో చూడాలి. అయినా మన దగ్గర సాధ్యం కాని మర్యాదరామన్న సీక్వెల్ ఐడియా హిందీలో వర్కౌట్ కావడం విశేషమే. చాలా గ్యాప్ తర్వాత అజయ్ దేవగన్ ఫుల్ లెన్త్ కామెడీ వేషం వేశాడు. ట్రైలర్ చూస్తుంటే జోకులు బాగానే దట్టించారు. అయితే కాన్సెప్ట్ కొంచెం అవుట్ డేటెడ్ గానే అనిపిస్తోంది. మళ్ళీ అదే తరహా హాస్యంతో నవ్వించడం కష్టమే. హౌస్ ఫుల్ 5 లాగా ఏదోలా బండి లాగిస్తుందేమో చూడాలి.
This post was last modified on July 11, 2025 2:28 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…