‘రన్ రాజా రన్’ సినిమా చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్తగా థింక్ చేసే మరో కొత్త టాలెంట్ వచ్చిందని సుజీత్ గురించి గొప్పగా చెప్పుకున్నారు. అతడి ఆలోచనలు నచ్చి వెంటనే ప్రభాస్ తనతో సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు. ఒక మాదిరి బడ్జెట్లో అనుకున్న ఆ సినిమా కాస్తా ‘బాహుబలి’ తర్వాత భారీ సినిమా అయిపోయింది. అనుభవలేమితో సుజీత్ ‘సాహో’ భారాన్ని మోయలేక ఇబ్బందులు పడ్డాడు.
అతడిని మళ్లీ ‘రన్ రాజా రన్’ లాంటి ఐడియాలతో సినిమా చేయమని అడగవచ్చు. కానీ ప్రభాస్తో చేసిన తర్వాత మళ్లీ అగ్ర హీరోతోనే చేయాలని అతడు భావిస్తున్నాడు. అందుకే చరణ్ని ఒప్పించడానికి ప్రయత్నించి ‘లూసిఫర్’ రీమేక్కి కన్సిడరేషన్లోకి వెళ్లాడు. కానీ సుజీత్ చేసిన మార్పులు చిరంజీవికి అంతగా నచ్చకపోవడంతో సుజీత్ ఆ రీమేక్ వదిలేసుకున్నాడు.
ఇప్పుడు మరోసారి అతడిని వెతుక్కుంటూ ఒక రీమేక్ సినిమానే వచ్చిందట. ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయాలని బెల్లంకొండ శ్రీనివాస్ ఉవ్విళ్లూరుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడెవరైతే బాగుంటుందనే డిస్కషన్లో సుజీత్ పేరు వచ్చిందట. ప్రస్తుతం అవకాశాలు లేవు కాబట్టి అతను ఈ రీమేక్ చేయడానికి ఓకే చెప్తాడో లేక ఒరిజినల్ ఐడియాతోనే చేద్దామని వెయిట్ చేస్తాడో చూడాలిక.
This post was last modified on November 16, 2020 4:37 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…