బాలీవుడ్ లో సెన్సేషన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న దర్శక నిర్మాతలు పెరిగిపోతున్నారు. ఇవాళ విడుదల కావాల్సిన ఉదయ్ పూర్ ఫైల్స్ ఆగిపోయింది. దీని మీద సెన్సార్ బోర్డు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏకంగా 150 కట్లను సూచించడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిలించే విషంగా ఇందులో సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయనేది అధికారుల నుంచి వస్తున్న అభ్యంతరం. దీని రిలీజ్ గురించి కేంద్రానికి వారం గడువు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటీషన్ వేసిన జర్నలిస్ట్ ప్రశాంత్ టాండన్, జఊఏహింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ వాదనలను పరిగణనలోకి తీసుకుంది.
అసలు ఇంతగా కాంట్రావర్సి ఏముందో చూద్దాం. 2022 ఉదయ్ పూర్ నగరంలో టైలర్ వృత్తి చేసుకునే కన్హయ్య లాల్ పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో అతను పోస్ట్ పెట్టడమే దీనికి కారణం. రియాజ్ అక్తర్, గౌస్ మహమ్మద్ ఈ ఘాతుకానికి పాల్పడటమే కాకుండా క్రూరంగా గొంతు కోసి చంపడాన్ని వీడియో తీసి విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కత్తిని ఎదురు కోవాల్సి ఉంటుందని అందులో హెచ్చరించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా నిందితులను పట్టుకుని జైలుకు తరలించారు.
ఇదంతా ఉదయ్ పూర్ ఫైల్స్ లో చూపించారు. హంతకులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, దానికి ప్రేరేపించబడిన కారణాలు, ప్రవక్తను ఉద్దేశించి నుపుర్ శర్మ చేసిన కామెంట్స్ అన్ని ఇందులో పెట్టేశారు. దర్శకుడు భరత్ ఎస్ శ్రీనేట్ తన ప్రయత్నాన్ని సమర్ధించుకున్నారు. ఇది కేవలం భావజాలాలు చూపించే ప్రయత్నమని, ఏ మతాన్ని కించపరచలేదని అంటున్నారు. కన్హయ్య లాల్ పాత్రను ప్రముఖ నటుడు విజయ్ రాజ్ పోషించాడు. ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలో కాంట్రవర్సి టాపిక్ తీసుకున్న ఉదయ్ పూర్ ఫైల్స్ టైటిల్ ని అదే తరహాలో పెట్టడం గమనించాల్సిన విషయం. ఫైనల్ గా రూట్ క్లియరవుతుందో లేదో చూడాలి.
This post was last modified on July 11, 2025 11:54 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…