బిగ్బాస్ హౌస్ నుంచి టిక్టాక్ స్టార్ మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయాడు. టాస్కులు బ్రహ్మాండంగా ఆడేస్తే ప్రేక్షకులు తనకు ఓట్లు వేస్తారని మెహబూబ్ బలంగా నమ్మాడు. అందుకే తనను తాను స్ట్రాంగ్ అని చెప్పుకునేవాడు. అతడు పెట్టే ఎఫర్టస్కి మెహబూబ్ కచ్చితంగా టాప్ 5లో వుంటాడని హౌస్మేట్స్ కూడా భావించారు. కానీ అరియానా, మోనల్, హారిక లాంటి వాళ్లు సేవ్ అయి పదవ వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అవడంతో అంతా షాకయ్యారు.
మెహబూబ్ అయితే అసలు నమ్మలేక తన దురదృష్టాన్ని నిందించాడు. నిజానికి బిగ్బాస్ కావాలని పొడిగించి వుండకపోతే మెహబూబ్ అయిదు వారాలలోనే ఎలిమినేట్ అయి వుండేవాడు. మెహబూబ్ ఎలిమినేట్ అవడంతో హౌస్లో మిగిలిన వారికి ఏమి చేస్తే ఆడియన్స్ ఆదరణ దక్కుతుందనే దానిపై క్లారిటీ పూర్తిగా పోయింది. అసలు ఆడియన్స్ ఏమి చూసి ఓట్లేస్తున్నారు? టాస్కులు ఆడినా లేకపోయినా మిగతా టైమ్లో డ్రామా నడిపే వారికే ఎక్కువ ఫుటేజ్ దక్కుతుంది.
మెహబూబ్ టాస్కులలో తప్ప మామూలుగా ఎక్కడున్నాడనేది కనిపించేది కాదు. అమ్మాయిలతో పరాచికాలు ఆడుతూ… నిజంగా వాళ్లపై ఫీలింగ్స్ వున్నా లేకపోయినా కెమెరాల కోసం నటించాలి. ఈ సంగతి మొదట్నుంచీ అమల్లో పెట్టిన వారిలో చాలా మంది ఇంకా హౌస్లో మిగిలి వున్నారు. లాస్య, సోహైల్ మాత్రమే అలాంటి వాటి జోలికి పోలేదింకా. కాకపోతే సోహైల్ ఆవేశం అతడికి గుర్తింపు తెచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చింది.
ఫుటేజీ స్టార్లతో మిగతా వాళ్లు కూడా పోటీ పడక తప్పని పరిస్థితిలో ఇప్పుడెవరు చివరి వారం వరకు మిగుల్తారనేది ఆసక్తికరమైన అంశం. ఇదిలావుంటే ఎలిమినేట్ అయిన వారిలో ఒకరితో రీఎంట్రీ ఇప్పించి బయట ఏమి జరుగుతుందనేది లోపలి వారికి తెలిసేట్టు చేయడానికి ప్రణాళిక రచించారని సమాచారం.
This post was last modified on November 16, 2020 4:38 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…