బిగ్బాస్ హౌస్ నుంచి టిక్టాక్ స్టార్ మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయాడు. టాస్కులు బ్రహ్మాండంగా ఆడేస్తే ప్రేక్షకులు తనకు ఓట్లు వేస్తారని మెహబూబ్ బలంగా నమ్మాడు. అందుకే తనను తాను స్ట్రాంగ్ అని చెప్పుకునేవాడు. అతడు పెట్టే ఎఫర్టస్కి మెహబూబ్ కచ్చితంగా టాప్ 5లో వుంటాడని హౌస్మేట్స్ కూడా భావించారు. కానీ అరియానా, మోనల్, హారిక లాంటి వాళ్లు సేవ్ అయి పదవ వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అవడంతో అంతా షాకయ్యారు.
మెహబూబ్ అయితే అసలు నమ్మలేక తన దురదృష్టాన్ని నిందించాడు. నిజానికి బిగ్బాస్ కావాలని పొడిగించి వుండకపోతే మెహబూబ్ అయిదు వారాలలోనే ఎలిమినేట్ అయి వుండేవాడు. మెహబూబ్ ఎలిమినేట్ అవడంతో హౌస్లో మిగిలిన వారికి ఏమి చేస్తే ఆడియన్స్ ఆదరణ దక్కుతుందనే దానిపై క్లారిటీ పూర్తిగా పోయింది. అసలు ఆడియన్స్ ఏమి చూసి ఓట్లేస్తున్నారు? టాస్కులు ఆడినా లేకపోయినా మిగతా టైమ్లో డ్రామా నడిపే వారికే ఎక్కువ ఫుటేజ్ దక్కుతుంది.
మెహబూబ్ టాస్కులలో తప్ప మామూలుగా ఎక్కడున్నాడనేది కనిపించేది కాదు. అమ్మాయిలతో పరాచికాలు ఆడుతూ… నిజంగా వాళ్లపై ఫీలింగ్స్ వున్నా లేకపోయినా కెమెరాల కోసం నటించాలి. ఈ సంగతి మొదట్నుంచీ అమల్లో పెట్టిన వారిలో చాలా మంది ఇంకా హౌస్లో మిగిలి వున్నారు. లాస్య, సోహైల్ మాత్రమే అలాంటి వాటి జోలికి పోలేదింకా. కాకపోతే సోహైల్ ఆవేశం అతడికి గుర్తింపు తెచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చింది.
ఫుటేజీ స్టార్లతో మిగతా వాళ్లు కూడా పోటీ పడక తప్పని పరిస్థితిలో ఇప్పుడెవరు చివరి వారం వరకు మిగుల్తారనేది ఆసక్తికరమైన అంశం. ఇదిలావుంటే ఎలిమినేట్ అయిన వారిలో ఒకరితో రీఎంట్రీ ఇప్పించి బయట ఏమి జరుగుతుందనేది లోపలి వారికి తెలిసేట్టు చేయడానికి ప్రణాళిక రచించారని సమాచారం.
This post was last modified on November 16, 2020 4:38 pm
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…