రామ్ చరణ్, శంకర్ల క్రేజీ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ చేంజర్’ గురించి అభిమానులు ఎంతో ఊహించుకున్నారు. రాజు కూడా ఇది తనకు జాక్ పాట్ ప్రాజెక్టు అవుతుందనుకున్నారు. కానీ చివరికి అంతా తల్లకిందులైంది. ఈ సినిమాతో దిల్ రాజు ఎన్నడూ ఎరుగని నష్టాలు ఎదుర్కొన్నారు. ఇన్నేళ్ల ప్రొడక్షన్లో దిల్ రాజుకు వచ్చిన మొత్తం నష్టాలు ఎంత ఉంటాయో.. ఈ ఒక్క చిత్రంతో అంత నష్టపోయాడని అప్పట్లో మాట్లాడుకున్నారు. కానీ ఆ దెబ్బ నుంచి రాజు వెంటనే కోలుకున్నారు. ‘గేమ్ చేంజర్’ వచ్చిన మూడు రోజులకే రిలీజైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర అసాధారణంగా ఆడేసి భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
‘గేమ్ చేంజర్’ నష్టాలు 70 శాతం దాకా ఈ సినిమాతో భర్తీ అయిపోయినట్లు స్వయంగా రాజునే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మొత్తానికి సంక్రాంతి టైంలో రాజు అలా సేవ్ అయిపోయారు. కానీ అంతటితో కథ అయిపోలేదు. ఆరు నెలల తర్వాత రాజుకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘తమ్ముడు’ భారీ నష్టాలనే మిగిల్చింది. నితిన్ ట్రాక్ రికార్డు ఘోరంగా ఉన్నప్పటికీ.. రాజు ధైర్యంగా ఈ సినిమా మీద రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.30 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు సమాచారం.
థియేటర్ల నుంచి రూ.40 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. కానీ తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ ‘తమ్ముడు’ ఇప్పటివరకు రూ.4 కోట్లకు మించి షేర్ రాబట్టలేకపోయింది. టార్గెట్లో పది శాతం మాత్రమే రికవరీ అంటే ఇది ఎంత పెద్ద దెబ్బో అర్థం చేసుకోవచ్చు. ‘తమ్ముడు’ మీద ఏకంగా రూ.35 కోట్ల దాకా పోయిందన్నమాట. బయ్యర్లకు మంచి రేటుకు అమ్మి రాజు సేవ్ అయిపోయారు అనుకోవడానికి లేదు. రాజు బయ్యర్లందరూ ఆయన దగ్గర రెగ్యులర్గా సినిమాలు కొనేవాళ్లు. వాళ్లకు ఇంకో సినిమాతో నష్టాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తర్వాత ‘యెల్లమ్మ’ పట్టాలెక్కుతుంది. మరి వీటిలో ఏది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలో మ్యాజిక్ చేసి ‘తమ్ముడు’ నష్టాలను భర్తీ చేస్తుందో చూడాలి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…