సినీ పరిశ్రమలో వారసత్వం చర్చ ఇప్పటిది కాదు. స్టార్ కుటుంబాల నుంచి వచ్చిన హీరోలను బలవంతంగా ప్రేక్షకుల మీదకు రుద్డుత్తున్నారనే చర్చ సంవత్సరాలుగా జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ గోల ఎక్కువగా ఉంటుంది. నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయంగా చాలా విమర్శలు ఎదురుకున్నాడు. అయినా టాలెంట్ లేనిదే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా నిలదొక్కుకోవడం కష్టం. ఎస్వి రంగారావు మనవడు హీరో కావడానికి ట్రై చేసినా పనవ్వలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ పిల్లల్లో అందరూ బాలకృష్ణ లాగా స్టార్ హీరో స్థాయికి చేరుకోలేదు. నాగార్జున వారసుల్లో నాగచైతన్య సెటిల్ కాగా అఖిల్ ఇంకా మొదటి బ్లాక్ బస్టర్ కోసం పోరాడుతున్నాడు.
మాములుగా ఈ టాపిక్ గురించి మన హీరోలు ఓపెన్ స్టేజి మీద మాట్లాడ్డం అరుదు. ఇవాళ జరిగిన సుహాస్ ఓ భామ అయ్యో రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీలో నెగ్గుకొస్తారనే మాట నిజం కాదని, ఆ మాటకొస్తే ఆ పప్పులేం ఉడకవని, నెపో కిడ్స్ అయినా దేకాల్సిందే అంటూ తననే ఉదాహరణగా చెప్పుకున్నారు. నిజమేగా. మోహన్ బాబు లాంటి పవర్ ఫుల్ నేపథ్యం ఉన్నప్పటికీ మంచు మనోజ్ పూర్తి స్థాయిలో సెటిల్ కాలేకపోయాడు. హీరోగా వరస సక్సెస్ లు చూడలేకపోయాడు. ఇటీవలే భైరవంలో విలన్ గా రీ ఎంట్రీ ఇస్తే అది కూడా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
ఇంకో కోణంలో చూస్తే చిరంజీవి, రవితేజ, నాని ఇలా ఎందరో హీరోలు సపోర్ట్ లేకుండానే పెద్ద మార్కెట్, ఇమేజ్ సృష్టించుకున్నవాళ్ళు. సుహాస్ కూడా ఇదే క్యాటగిరి కానీ ఇంకా వీళ్ళ సరసన చేరుకోలేదు. మనోజ్ చెప్పిన నెపో కిడ్స్ కామెంట్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. తనకు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టే కొన్ని స్క్రిప్టులు నో చెప్పలేకపోయానని విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో చెప్పి కొద్దిగంటలు కాక ముందే మంచు మనోజ్ ఇలా చెప్పడం ట్విస్ట్. జూలై 11 విడుదల కాబోతున్న ఓ భామ అయ్యో రామా మీద సుహాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అనుష్క ఘాటీ తప్పుకోవడం కలిసి వచ్చేలా ఉంది.
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…