సినీ పరిశ్రమలో వారసత్వం చర్చ ఇప్పటిది కాదు. స్టార్ కుటుంబాల నుంచి వచ్చిన హీరోలను బలవంతంగా ప్రేక్షకుల మీదకు రుద్డుత్తున్నారనే చర్చ సంవత్సరాలుగా జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ గోల ఎక్కువగా ఉంటుంది. నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయంగా చాలా విమర్శలు ఎదురుకున్నాడు. అయినా టాలెంట్ లేనిదే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా నిలదొక్కుకోవడం కష్టం. ఎస్వి రంగారావు మనవడు హీరో కావడానికి ట్రై చేసినా పనవ్వలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ పిల్లల్లో అందరూ బాలకృష్ణ లాగా స్టార్ హీరో స్థాయికి చేరుకోలేదు. నాగార్జున వారసుల్లో నాగచైతన్య సెటిల్ కాగా అఖిల్ ఇంకా మొదటి బ్లాక్ బస్టర్ కోసం పోరాడుతున్నాడు.
మాములుగా ఈ టాపిక్ గురించి మన హీరోలు ఓపెన్ స్టేజి మీద మాట్లాడ్డం అరుదు. ఇవాళ జరిగిన సుహాస్ ఓ భామ అయ్యో రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీలో నెగ్గుకొస్తారనే మాట నిజం కాదని, ఆ మాటకొస్తే ఆ పప్పులేం ఉడకవని, నెపో కిడ్స్ అయినా దేకాల్సిందే అంటూ తననే ఉదాహరణగా చెప్పుకున్నారు. నిజమేగా. మోహన్ బాబు లాంటి పవర్ ఫుల్ నేపథ్యం ఉన్నప్పటికీ మంచు మనోజ్ పూర్తి స్థాయిలో సెటిల్ కాలేకపోయాడు. హీరోగా వరస సక్సెస్ లు చూడలేకపోయాడు. ఇటీవలే భైరవంలో విలన్ గా రీ ఎంట్రీ ఇస్తే అది కూడా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
ఇంకో కోణంలో చూస్తే చిరంజీవి, రవితేజ, నాని ఇలా ఎందరో హీరోలు సపోర్ట్ లేకుండానే పెద్ద మార్కెట్, ఇమేజ్ సృష్టించుకున్నవాళ్ళు. సుహాస్ కూడా ఇదే క్యాటగిరి కానీ ఇంకా వీళ్ళ సరసన చేరుకోలేదు. మనోజ్ చెప్పిన నెపో కిడ్స్ కామెంట్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. తనకు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టే కొన్ని స్క్రిప్టులు నో చెప్పలేకపోయానని విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో చెప్పి కొద్దిగంటలు కాక ముందే మంచు మనోజ్ ఇలా చెప్పడం ట్విస్ట్. జూలై 11 విడుదల కాబోతున్న ఓ భామ అయ్యో రామా మీద సుహాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అనుష్క ఘాటీ తప్పుకోవడం కలిసి వచ్చేలా ఉంది.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…