1991 సంవత్సరం మే 21 దేశం మొత్తం ఉలిక్కిపడింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో బాంబు దాడి చేసి చంపడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇండియాలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరైన పొలిటీషియన్ ని అంత తేలిగ్గా హత్య చేయడం చూసి జనాలు నివ్వెరపోయారు. పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ పత్రికల్లో వచ్చిన కథనాలు బోలెడు. ఈ ఉదంతం మీద చాలా పుస్తకాలు వచ్చాయి. జాన్ అబ్రహం హీరోగా ‘మద్రాస్ కేఫ్’ అనే సినిమా వచ్చింది. అందులో రాశి ఖన్నా నటించింది. అయితే అది పరిమిత నిడివితో రాజీవ్ హత్యకు ముందు జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రం.
తాజాగా ‘ది హంట్ – ది రాజీవ్ గాంధీ అసాసినేషన్’ పేరుతో వెబ్ సిరీస్ వచ్చింది. ఎక్స్ పీఎం మర్డర్ జరిగిన వెంటనే సిబిఐ తరఫున కార్తికేయన్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి విచారణ మొదలు పెడుతుంది. ఘటనా స్థలంలో దొరికిన ఒక కెమెరాతో తీసిన ఫోటల ఆధారంగా నేరం తాలూకు లోతుల్లోకి వెళ్తారు. అప్పుడే దీని వెనుక శ్రీలంకలో హక్కుల కోసం పోరాడుతున్న ఎల్టిటీఈ ఉందని తెలుస్తుంది. దీంతో తమిళనాడులో దాని సానుభూతిపరుల కోసం వేట ముమ్మరమవుతుంది. ఈ కుట్రకు రచన చేసిన శివరాసన్ బెంగళూరులో తల దాచుకుంటే అతన్ని ఎలా కనిపెట్టారనే దాని మీద ఏడు ఎపిసోడ్లు రూపొందించారు. తెలుగు ఆడియో ఉంది.
ది హంట్ దర్శకుడు నగేష్ కుకునూర్. హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్, బాలీవుడ్ కాలింగ్ లాంటి ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసిన అనుభవముంది. అనిరుధ్య మిత్రా రాసిన 90 డేస్ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. క్లూస్ ని వెతికే తీరు, ఉగ్రవాదులను పట్టుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ఆత్మహత్యకు సిద్ధపడిన వాళ్ళ వ్యూహాలను కనుక్కునే విధానం చాలా ఇంటరెస్టింగ్ గా తీశారు. కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ ఇలాంటి కంటెంట్స్ ని ఇష్టపడే వాళ్ళు ఏ మాత్రం నిరాశపరచకుండా ది హంట్ సాగుతుంది. ఎన్నో విస్తుపోయే నిజాలు చూపించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. ఖర్చు పెట్టిన సమయానికి న్యాయం చేశాడు నగేష్ కుకునూర్.
This post was last modified on July 7, 2025 1:03 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…