1991 సంవత్సరం మే 21 దేశం మొత్తం ఉలిక్కిపడింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో బాంబు దాడి చేసి చంపడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇండియాలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరైన పొలిటీషియన్ ని అంత తేలిగ్గా హత్య చేయడం చూసి జనాలు నివ్వెరపోయారు. పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ పత్రికల్లో వచ్చిన కథనాలు బోలెడు. ఈ ఉదంతం మీద చాలా పుస్తకాలు వచ్చాయి. జాన్ అబ్రహం హీరోగా ‘మద్రాస్ కేఫ్’ అనే సినిమా వచ్చింది. అందులో రాశి ఖన్నా నటించింది. అయితే అది పరిమిత నిడివితో రాజీవ్ హత్యకు ముందు జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రం.
తాజాగా ‘ది హంట్ – ది రాజీవ్ గాంధీ అసాసినేషన్’ పేరుతో వెబ్ సిరీస్ వచ్చింది. ఎక్స్ పీఎం మర్డర్ జరిగిన వెంటనే సిబిఐ తరఫున కార్తికేయన్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి విచారణ మొదలు పెడుతుంది. ఘటనా స్థలంలో దొరికిన ఒక కెమెరాతో తీసిన ఫోటల ఆధారంగా నేరం తాలూకు లోతుల్లోకి వెళ్తారు. అప్పుడే దీని వెనుక శ్రీలంకలో హక్కుల కోసం పోరాడుతున్న ఎల్టిటీఈ ఉందని తెలుస్తుంది. దీంతో తమిళనాడులో దాని సానుభూతిపరుల కోసం వేట ముమ్మరమవుతుంది. ఈ కుట్రకు రచన చేసిన శివరాసన్ బెంగళూరులో తల దాచుకుంటే అతన్ని ఎలా కనిపెట్టారనే దాని మీద ఏడు ఎపిసోడ్లు రూపొందించారు. తెలుగు ఆడియో ఉంది.
ది హంట్ దర్శకుడు నగేష్ కుకునూర్. హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్, బాలీవుడ్ కాలింగ్ లాంటి ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసిన అనుభవముంది. అనిరుధ్య మిత్రా రాసిన 90 డేస్ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. క్లూస్ ని వెతికే తీరు, ఉగ్రవాదులను పట్టుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ఆత్మహత్యకు సిద్ధపడిన వాళ్ళ వ్యూహాలను కనుక్కునే విధానం చాలా ఇంటరెస్టింగ్ గా తీశారు. కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ ఇలాంటి కంటెంట్స్ ని ఇష్టపడే వాళ్ళు ఏ మాత్రం నిరాశపరచకుండా ది హంట్ సాగుతుంది. ఎన్నో విస్తుపోయే నిజాలు చూపించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. ఖర్చు పెట్టిన సమయానికి న్యాయం చేశాడు నగేష్ కుకునూర్.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…