Movie News

రాజా సాబ్ పోటీకి సై అన్న దురంధర్

పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు డిసెంబర్ 5 విడుదల లాక్ చేసుకున్న ది రాజా సాబ్ కు ఇప్పటిదాకా పోటీ వచ్చే ఆలోచన ఎవరూ చేయలేదు. ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ అంటే సహజంగా కాంపిటీషన్ లో ఎవరు ఉండరు. బాహుబలి నుంచి కల్కి దాకా ఇదే జరుగుతూ వచ్చింది. సహజంగానే రాజా సాబ్ కు అలాగే అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు సీన్ లోకి రణ్వీర్ సింగ్ వచ్చాడు. అతని కొత్త మూవీ దురంధర్ డిసెంబర్ 5 ఫిక్స్ చేసుకుని ఆ మేరకు ఒక టెర్రిఫిక్ టీజర్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చింది. యురి ది సర్జికల్ స్ట్రైక్ తో ప్రశంసలు అవార్డులు తెచ్చుకున్న ఆదిత్య ధార్ దీనికి దర్శకుడు.

దురంధర్ లో చాలా విశేషాలున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి నటీనటుల లిస్టు పెద్దదే ఉంది. సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. పైకి గ్యాంగ్ స్టర్ డ్రామాగా కనిపిస్తున్నా హై ఇంటెన్స్ డ్రామాగా ఆడియన్స్ ని కట్టిపడేస్తుందని ముంబై మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవహారాలు చూసుకునే రా ఏజెన్సీ ఏర్పడిన తొలినాళ్ళలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నారట. యురి తరహాలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని తీసుకున్నారట. శాశ్వత్ సచ్దేవ్ సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల వరకు సమస్య లేదు కానీ దురంధర్ వల్ల రాజా సాబ్ కు ఇబ్బంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటుంది. ముఖ్యంగా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర చోట్ల థియేటర్ల పరంగా అనుకున్న కౌంట్ దక్కదు. దీని వల్ల ప్యాన్ ఇండియా రెవిన్యూలో రణ్వీర్ సింగ్, ప్రభాస్ లు పంచుకోవాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే ప్రభాస్ తో క్లాష్ అయ్యేంత రేంజ్ దురంధర్ కు ఉండదు కానీ ఏదైనా టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. అఫీషియల్ గా చెప్పేసుకున్నారు కాబట్టి రిలీజ్ డేట్లలో ఎలాంటి మార్పు ఉండబోదు. గత ఏడాది పుష్ప 2 వచ్చిన డేట్ కే ఈసారి మంచి క్లాష్ ఉండబోతోంది.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

1 hour ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

3 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

4 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

5 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

8 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

9 hours ago