పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు డిసెంబర్ 5 విడుదల లాక్ చేసుకున్న ది రాజా సాబ్ కు ఇప్పటిదాకా పోటీ వచ్చే ఆలోచన ఎవరూ చేయలేదు. ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ అంటే సహజంగా కాంపిటీషన్ లో ఎవరు ఉండరు. బాహుబలి నుంచి కల్కి దాకా ఇదే జరుగుతూ వచ్చింది. సహజంగానే రాజా సాబ్ కు అలాగే అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు సీన్ లోకి రణ్వీర్ సింగ్ వచ్చాడు. అతని కొత్త మూవీ దురంధర్ డిసెంబర్ 5 ఫిక్స్ చేసుకుని ఆ మేరకు ఒక టెర్రిఫిక్ టీజర్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చింది. యురి ది సర్జికల్ స్ట్రైక్ తో ప్రశంసలు అవార్డులు తెచ్చుకున్న ఆదిత్య ధార్ దీనికి దర్శకుడు.
దురంధర్ లో చాలా విశేషాలున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి నటీనటుల లిస్టు పెద్దదే ఉంది. సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. పైకి గ్యాంగ్ స్టర్ డ్రామాగా కనిపిస్తున్నా హై ఇంటెన్స్ డ్రామాగా ఆడియన్స్ ని కట్టిపడేస్తుందని ముంబై మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవహారాలు చూసుకునే రా ఏజెన్సీ ఏర్పడిన తొలినాళ్ళలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నారట. యురి తరహాలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని తీసుకున్నారట. శాశ్వత్ సచ్దేవ్ సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల వరకు సమస్య లేదు కానీ దురంధర్ వల్ల రాజా సాబ్ కు ఇబ్బంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటుంది. ముఖ్యంగా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర చోట్ల థియేటర్ల పరంగా అనుకున్న కౌంట్ దక్కదు. దీని వల్ల ప్యాన్ ఇండియా రెవిన్యూలో రణ్వీర్ సింగ్, ప్రభాస్ లు పంచుకోవాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే ప్రభాస్ తో క్లాష్ అయ్యేంత రేంజ్ దురంధర్ కు ఉండదు కానీ ఏదైనా టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. అఫీషియల్ గా చెప్పేసుకున్నారు కాబట్టి రిలీజ్ డేట్లలో ఎలాంటి మార్పు ఉండబోదు. గత ఏడాది పుష్ప 2 వచ్చిన డేట్ కే ఈసారి మంచి క్లాష్ ఉండబోతోంది.
This post was last modified on July 6, 2025 9:29 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…