Movie News

అల్లు అరవింద్.. జాక్ పాట్ మిస్సయ్యాడా?

తెలుగులో ఇంకా దృఢంగా నిలబడి సినిమాలు తీస్తూ విజయవంతంగా సాగిపోతున్న సీనియర్ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన తరం నిర్మాతల్లో ఎంతోమంది ఇండస్ట్రీని ఖాళీ చేసి వెళ్లిపోయారు. సక్సెస్ రేట్ బాగా పడిపోయి, బడ్జెట్లు పెరిగిపోయి, ప్రొడక్షన్ నిర్మాతల చేతుల్లో లేని ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు తీయడం చాలా కష్టం అన్నది ఆ తరం నిర్మాతల అభిప్రాయం. కానీ అరవింద్ మాత్రం ట్రెండుకు తగ్గట్లు తనను తాను మార్చుకుంటూ, అప్‌డేట్ అవుతూ విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్నారు.

ఐతే ఒకప్పట్లా ఆయన పెద్ద సినిమాలు తీయడం మాత్రం తగ్గించేశారు. ఎప్పుడైనా అల్లు అర్జున్‌తో, వేరే వాళ్లను కలుపుకుని పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తున్నారే తప్ప.. అంతకుమించి రిస్క్ చేయట్లేదు. ఐతే లేక లేక అరవింద్ ఓ భారీ బడ్జెట్ సినిమా తీయడానికి కొన్నేళ్ల ముందు సన్నాహాలు చేసుకున్నారు. అదే.. రామాయణం. బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, వేరే బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ఆయన ఈ మెగా ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.

కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఇలాగే ఏళ్లు గడిచిపోయాయి. కట్ చేస్తే గత ఏడాది ‘రామాయణం’ సెట్స్ మీదికి వెళ్లింది. కానీ ఆ ప్రాజెక్టులో అరవింద్ లేరు. మధు మంతెన సైతం మిస్ అయ్యారు. ముందు వీళ్లు ప్రకటించినట్లే నితీశ్ తివారి దర్శకత్వంలోనే సినిమా మొదలైంది. కానీ కాస్ట్ అండ్ క్రూలోనూ మార్పులు జరిగాయి. అరవింద్ భాగస్వామిగా ఉండగా ఇందులో మహేష్ బాబును రాముడిగా చూపించాలన్న చర్చ కూడా జరగడం విశేషం. వేరే ఆప్షన్లు కూడా కొన్ని వినిపించాయి. కానీ చివరికి రణబీర్ కపూర్ హీరోగా సినిమా మొదలైంది.

అరవింద్ ఏ కారణంతో ఈ సినిమా నుంచి బయటికి వచ్చేశారో కానీ.. ఇటీవల రిలీజైన షో రీల్ చూశాక ఆయన గొప్ప అవకాశాన్ని మిస్సయ్యారా అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇది ఇండియన్ బాక్సాఫీస్‌లో ‘బాహుబలి’ తరహాలో సెన్సేషన్ క్రియేట్ చేయగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో అరవింద్ భాగస్వామిగా ఉంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గీతా ఆర్ట్స్ పేరు మార్మోగేదని.. అది టాలీవుడ్‌కు కూడా గర్వకారణంగా ఉండేదని. ఆయన మంచి ఛాన్స్ మిస్సయ్యారని టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

This post was last modified on July 6, 2025 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago