Movie News

అల్లు అరవింద్.. జాక్ పాట్ మిస్సయ్యాడా?

తెలుగులో ఇంకా దృఢంగా నిలబడి సినిమాలు తీస్తూ విజయవంతంగా సాగిపోతున్న సీనియర్ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన తరం నిర్మాతల్లో ఎంతోమంది ఇండస్ట్రీని ఖాళీ చేసి వెళ్లిపోయారు. సక్సెస్ రేట్ బాగా పడిపోయి, బడ్జెట్లు పెరిగిపోయి, ప్రొడక్షన్ నిర్మాతల చేతుల్లో లేని ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు తీయడం చాలా కష్టం అన్నది ఆ తరం నిర్మాతల అభిప్రాయం. కానీ అరవింద్ మాత్రం ట్రెండుకు తగ్గట్లు తనను తాను మార్చుకుంటూ, అప్‌డేట్ అవుతూ విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్నారు.

ఐతే ఒకప్పట్లా ఆయన పెద్ద సినిమాలు తీయడం మాత్రం తగ్గించేశారు. ఎప్పుడైనా అల్లు అర్జున్‌తో, వేరే వాళ్లను కలుపుకుని పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తున్నారే తప్ప.. అంతకుమించి రిస్క్ చేయట్లేదు. ఐతే లేక లేక అరవింద్ ఓ భారీ బడ్జెట్ సినిమా తీయడానికి కొన్నేళ్ల ముందు సన్నాహాలు చేసుకున్నారు. అదే.. రామాయణం. బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, వేరే బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ఆయన ఈ మెగా ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.

కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఇలాగే ఏళ్లు గడిచిపోయాయి. కట్ చేస్తే గత ఏడాది ‘రామాయణం’ సెట్స్ మీదికి వెళ్లింది. కానీ ఆ ప్రాజెక్టులో అరవింద్ లేరు. మధు మంతెన సైతం మిస్ అయ్యారు. ముందు వీళ్లు ప్రకటించినట్లే నితీశ్ తివారి దర్శకత్వంలోనే సినిమా మొదలైంది. కానీ కాస్ట్ అండ్ క్రూలోనూ మార్పులు జరిగాయి. అరవింద్ భాగస్వామిగా ఉండగా ఇందులో మహేష్ బాబును రాముడిగా చూపించాలన్న చర్చ కూడా జరగడం విశేషం. వేరే ఆప్షన్లు కూడా కొన్ని వినిపించాయి. కానీ చివరికి రణబీర్ కపూర్ హీరోగా సినిమా మొదలైంది.

అరవింద్ ఏ కారణంతో ఈ సినిమా నుంచి బయటికి వచ్చేశారో కానీ.. ఇటీవల రిలీజైన షో రీల్ చూశాక ఆయన గొప్ప అవకాశాన్ని మిస్సయ్యారా అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇది ఇండియన్ బాక్సాఫీస్‌లో ‘బాహుబలి’ తరహాలో సెన్సేషన్ క్రియేట్ చేయగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో అరవింద్ భాగస్వామిగా ఉంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గీతా ఆర్ట్స్ పేరు మార్మోగేదని.. అది టాలీవుడ్‌కు కూడా గర్వకారణంగా ఉండేదని. ఆయన మంచి ఛాన్స్ మిస్సయ్యారని టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

This post was last modified on July 6, 2025 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

4 hours ago