Movie News

దివాలా వార్తలపై స్పందించిన రకుల్ భర్త

బాలీవుడ్ బడా బేనర్లలో ఒకటి.. పూజా ఎంటర్టైన్మెంట్స్. ఈ బేనర్ మీద దశాబ్దాల నుంచి భారీ చిత్రాలు నిర్మిస్తున్నరు వశు భగ్నాని. ఆయన తనయుడు జాకీ భగ్నాని ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు నిర్మాతగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ను పెళ్లాడడంతో అతడి పాపులారిటీ ఇంకా పెరిగింది. ఐతే భగ్నాని కుటుంబానికి సినిమాల్లో ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి. అందులోనూ గత ఏడాది పూజా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన ‘బడేమియా చోటేమియా’ ఆ సంస్థ పునాదులను కదిలించేసింది. అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాపై రూ.350 కోట్ల బడ్జెట్ పెడితే అందులో మూడో వంతు కూడా వెనక్కి రాలేదు.

ఈ సినిమా దెబ్బకు భగ్నాని ఫ్యామిలీ ఆఫీసులు మూసేయడం, ఆస్తులు తనఖాపెట్టుకోవడం వరకు వెళ్లిందని వార్తలు వచ్చాయి. ఈ కుటుంబం పూర్తిగా దివాలా తీసినట్లు కూడా ప్రచారం జరిగింది. ‘బడేమియా చోటేమియా’తో తాము భారీ నష్టాలు చవిచూసిన మాట వాస్తవమే అని గతంలో అంగీకరించిన జాకీ భగ్నాని.. తాము దివాలా తీసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించాడు. జుహులో తాము కోల్పోయిన భారీ బిల్డింగ్‌ను తిరిగి సొంతం చేసుకున్నట్లు అతను వెల్లడించాడు. తాను ఆ బిల్డింగ్‌ను అమ్మేశానని, తన దగ్గర తిండి తినడానికి కూడా డబ్బులు లేవని, పారిపోయానని వార్తలు సృష్టిస్తున్నారని.. కానీ ఇవేవీ వాస్తవాలు కావని జాకీ స్పష్టం చేశాడు.

వార్తల్లో నిలిచిన ఆ భవనాన్ని తాను సొంతం చేసుకున్నానని.. తన గురించి వస్తున్న రూమర్లకు తాను ఎవరినీ నిందించదలుచుకోలేదని జాకీ వ్యాఖ్యానించాడు. ‘బడేమియా చోటేమియా’ సినిమా కోసం తీసుకున్న బ్యాంకు లోన్ల విషయంలో ఇబ్బంది పడ్డ మాట వాస్తవమని.. కానీ తాను ఆ లోన్లను తీర్చలేనని చాలామంది అనుకున్నారని.. కానీ అన్ని సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నామని జాకీ తెలిపాడు. ఈ సినిమా విషయంలో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కు అవకాశం ఇవ్వడం తాము చేసిన పెద్ద తప్పని ఈ సందర్భంగా జాకీ అన్నాడు.

Kumar

Recent Posts

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

1 hour ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

1 hour ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

2 hours ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

2 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

2 hours ago

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

2 hours ago