ఈ రోజు నితిన్ తమ్ముడు రిలీజయ్యింది. తన కెరీర్ లోనే అత్యథిక బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ మూవీగా దీని మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ చాలా క్యాలికులేటెడ్ ఉండే నిర్మాత దిల్ రాజు కేవలం ప్రొడక్షన్ కే ముప్పై అయిదు కోట్లు ఖర్చు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో గేమ్ ఛేంజర్ టాపిక్ వివాదం కాగా దానికి క్షమాపణతో శిరీష్ చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. దీని వల్ల తమ్ముడు పబ్లిసిటీ కొంత డైవర్ట్ అయినప్పటికీ టాక్ తో కంటెంట్ కనక మెప్పిస్తే ఇదంతా మర్చిపోయే వ్యవహారమే కాబట్టి ఆశలన్నీ పబ్లిక్ మీదే ఉన్నాయి.
తమ్ముడుకి మంచి అవకాశాలున్నాయి. కుబేర ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. కన్నప్ప నెమ్మదించాడు. బాక్సాఫీస్ దగ్గర గ్యాప్ ఉంది. చూడొచ్చు అనే మాట తెచ్చుకున్నా చాలు నితిన్ కోసం వచ్చే ప్రేక్షకులు ఉన్నారు. సూపర్ ఓపెనింగ్ దక్కకపోయినా టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రం వేగంగా పికపయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎస్విసి బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇదే. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చేశాక దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ తమ్ముడు స్క్రిప్ట్ మీద చాలా సమయం ఖర్చు పెట్టారు. ఆ శ్రమ చూసే దిల్ రాజు ఖర్చు విషయంలో వెనుకాడలేదన్నది స్పష్టమవుతోంది.
ఓవర్సీస్ రిపోర్టుల సంగతి ఎలా ఉన్నా తమ్ముడుకి ముఖ్యంగా కావాల్సింది బీసీ సెంటర్ల సపోర్ట్. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అవి కనక కనెక్ట్ అయితే కలెక్షన్లు రాబట్టవచ్చు. వచ్చే వారం రావాల్సిన అనుష్క ఘాటీ వాయిదా పడింది. హరిహర వీరమల్లుకి ఇంకో ఇరవై రోజుల టైం ఉంది. తమ్ముడు కనక ఈ అడ్వాంటేజ్ వాడుకుంటే మూడు వారాలు స్ట్రాంగ్ రన్ దక్కుతుంది. దిల్ రాజు సెట్ చేసుకున్న రిలీజ్ డేట్ మంచి స్ట్రాటజీతో ఉంది. కాకపోతే దాన్ని నిలబెట్టుకునే టాక్, రివ్యూస్ కీలకం కాబోతున్నాయి. కెరీర్ పరంగా కాస్త డీలాగా ఉన్న నితిన్ కు తమ్ముడు ఆక్సీజన్ ఇవ్వాలి. ఫ్యాన్స్ కోరుకుంటున్నది అదే.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…