విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని డివివి ఎంటర్ టైన్మెంట్స్ తరచుగా స్పష్టం చేస్తున్నప్పటికీ OG వాయిదా ప్రచారాలు ఆగడం లేదు. సెప్టెంబర్ 25 ఎప్పుడెప్పుడు వస్తుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు కన్నా దీని మీదే బజ్ ఎక్కువగా ఉన్న మాట నిజమే. అయితే పోస్ట్ పోన్ గురించి కొత్తగా ప్రచారం ఎందుకు మొదలయ్యిందనే కోణంలో విచారణ చేస్తే పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. విశ్వంభర విఎఫ్ఎక్స్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తోందట. చిరంజీవి సంతృప్తి పడేలా ఫైనల్ కాపీ సిద్ధమయ్యిందని, ఆయన చూడటమే బాకీ అనే వార్త ఆల్రెడీ బయటికొచ్చింది.
జూలై, ఆగస్ట్ లో విశ్వంభర రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. కానీ సెప్టెంబర్ లో ఓజి ఉంది. ఒకవేళ ఇది కనక తప్పుకునే పక్షంలో ఆ డేట్ ని విశ్వంభర తీసుకోవచ్చనే ఆలోచనలో యువి క్రియేషన్స్ లో ఉంది. అయితే ఓజి అంత సులభంగా వెనక్కు తగ్గే సూచనలు లేవు. కానీ ఇక్కడో చిక్కు ఉంది. చేతిలో కేవలం రెండు నెలల టైం ఉంది. దీంట్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయడంతో పాటు తమన్ రీ రికార్డింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లు అన్నీ చేసేయాలి. ఓజికి ప్రత్యేకంగా పబ్లిసిటీ అక్కర్లేకపోయినా ఇప్పుడున్న మార్కెటింగ్ పరిస్థితుల్లో సాధారణ ప్రేక్షకుల్లో హైప్ పెంచడం కోసం ఇవి చేయక తప్పదు.
ఈ సమయం సరిపోకపోవచ్చనే అంచనా డివివి బృందంలో ఉందట. ముందైతే సెప్టెంబర్ 25కే కట్టుబడి ఆ మేరకు పనులు స్పీడప్ చేసినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటిదాకా కేవలం రెండు నెలల గ్యాప్ లో రెండు కొత్త సినిమాలు రిలీజ్ కావడం ఎప్పుడూ జరగలేదు. జూలై 24 హరిహర వీరమల్లు, సెప్టెంబర్ 25 ఓజి కనక వస్తే ఒక కొత్త రికార్డు నమోదు చేసినట్టు అవుతుంది. అయితే పవన్ లాంటి టయర్ 1 హీరో ఇంత తక్కువ నిడివిలో రావడం అంత సేఫ్ కాదనేది ట్రేడ్ లో వినిపిస్తున్న కామెంట్. ఏ నిమిషానికి ఏమి జరుగునో పాట తరహాలో మాటకు కట్టుబడటాలు, వాయిదాల గురించి వెంటనే నిర్ధారణకు రాలేం.
This post was last modified on July 3, 2025 5:03 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…