టాలీవుడ్లో ఆచితూచి సినిమాలు చేసే నటుల్లో అడివి శేష్ ఒకరు. ఒకప్పుడు చిన్న స్థాయి నటుడిగా ఉన్న శేష్.. ‘క్షణం’ దగ్గర్నుంచి అద్భుతమైన సినిమాలు చేస్తూ స్టార్గా ఎదిగాడు. శేష్ సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే ధీమా ఇప్పుడు అందరిలోనూ ఉంది. అందుకే తనతో కలిసి పని చేయడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా అమితాసక్తి చూపుతుంటారు. అలాంటిది శేష్ సినిమా నుంచి శ్రుతి హాసన్ తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. వీరి కలయికలో ‘డెకాయిల్’ సినిమా మొదలై కొంత చిత్రీకరణ కూడా జరుపుకుంది. కానీ తర్వాత చూస్తే.. శ్రుతి స్థానంలోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది.
మరి శ్రుతి ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుంది అన్నది సస్పెన్సే. తాజాగా శేష్ ఈ సస్పెన్సుకి తెరదించాడు. శ్రుతి హాసన్ ‘కూలీ’ సహా కొన్ని చిత్రాల్లో నటిస్తోందని.. ఆ సినిమాల షెడ్యూళ్లకు, తమ చిత్రానికి క్లాష్ రావడం వల్లే శ్రుతి తప్పుకోవాల్సి వచ్చిందని అతను తెలిపాడు. తమ సినిమా కొంచెం ఆలస్యం కావడంతో శ్రుతి డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి వచ్చిందని శేష్ తెలిపాడు.
ఇదేమీ ఘర్షణతో తీసుకున్న నిర్ణయం కాదని.. సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతోనే శ్రుతి ‘డెకాయిట్’ నుంచి తప్పుకుందని శేష్ తెలిపాడు. ఇప్పటిదాకా ‘డెకాయిట్’ చిత్రీకరణ 60 శాతం పూర్తయినట్లు అతను వెల్లడించాడు. గూఢచారి, వైల్డ్ డాగ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేసిన షనీల్ డియో ‘డెకాయిట్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శేష్ దీంతో పాటు ‘గూఢచారి’ సీక్వెల్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…
కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…
దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత సెలెక్టివ్ గా ఉంటారో తెలిసిందే. కథలు, క్యాస్టింగ్, టీమ్, కంటెంట్ ఏదైనా సరే రాజీ…
భారతీయ సినిమాలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో 94 ఏళ్ల వయసులో ఫీచర్ ఫిలిం తీసి అబ్బురపరిచారు సింగీతం శ్రీనివాసరావు.…