హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న తేజ సజ్జ కొత్త ప్యాన్ ఇండియా మూవీ మిరాయ్ సెప్టెంబర్ 5 విడుదలని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఏప్రిల్ లో రావాలని అనుకున్నప్పటికీ షూటింగ్ లో జాప్యంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల నాలుగు నెలలు వాయిదా వేసుకుంది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలనిజం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. సోలో రిలీజ్ కోసం ట్రై చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మంచి డేట్ పట్టుకుంది కానీ మరో రెండు గండాలు పోటీ రూపంలో ముంచుకు రాబోతున్నాయి.
దుల్కర్ సల్మాన్ కాంతని సెప్టెంబర్ 5 విడుదల చేసేందుకు నిర్మాత రానా దగ్గుబాటి ప్లాన్ చేస్తున్నట్టు ఫ్రెష్ అప్డేట్. ఇది చాలా నెలలుగా నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పీరియాడిక్ సెటప్ లో డిఫరెంట్ థ్రిల్లర్ గా తీస్తున్నారట. ఇది కాకుండా శివ కార్తికేయన్ మదరాసి సైతం అదే డేట్ కు వస్తోంది. గతంలోనే అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద మంచి అంచనాలున్నాయి. సికందర్ డైరెక్టర్ ట్రాక్ రికార్డు కన్నా అమరన్ హీరోగా జరిగే మార్కెటింగ్ మీద నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
ఇదే జరిగితే మిరాయ్ కు ఇతర రాష్ట్రాల్లో పోటీ పరంగా చిక్కులు తప్పవు. కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఎలాంటి కాంపిటేషన్ అయినా తట్టుకోవచ్చని హనుమాన్ గతంలో నిరూపించింది. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లను దాటుకుని తేజ సజ్జ గెలిచాడు. ప్రతిసారి అలాగే జరుగుతుందని కాదు కానీ నాన్ సంక్రాంతి సీజన్ లో ఎంతైనా పోటీ వల్ల రిస్క్ ఉంటుంది. మిరాయ్ లో ఉన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ఇచ్చేలా ఉంటాయని టీమ్ చెబుతోంది. రాజా సాబ్ కన్నా ముందు పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న సినిమా కావడంతో మిరాయ్ మీద బయ్యర్ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
This post was last modified on June 30, 2025 11:49 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…