హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న తేజ సజ్జ కొత్త ప్యాన్ ఇండియా మూవీ మిరాయ్ సెప్టెంబర్ 5 విడుదలని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఏప్రిల్ లో రావాలని అనుకున్నప్పటికీ షూటింగ్ లో జాప్యంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల నాలుగు నెలలు వాయిదా వేసుకుంది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలనిజం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. సోలో రిలీజ్ కోసం ట్రై చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మంచి డేట్ పట్టుకుంది కానీ మరో రెండు గండాలు పోటీ రూపంలో ముంచుకు రాబోతున్నాయి.
దుల్కర్ సల్మాన్ కాంతని సెప్టెంబర్ 5 విడుదల చేసేందుకు నిర్మాత రానా దగ్గుబాటి ప్లాన్ చేస్తున్నట్టు ఫ్రెష్ అప్డేట్. ఇది చాలా నెలలుగా నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పీరియాడిక్ సెటప్ లో డిఫరెంట్ థ్రిల్లర్ గా తీస్తున్నారట. ఇది కాకుండా శివ కార్తికేయన్ మదరాసి సైతం అదే డేట్ కు వస్తోంది. గతంలోనే అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద మంచి అంచనాలున్నాయి. సికందర్ డైరెక్టర్ ట్రాక్ రికార్డు కన్నా అమరన్ హీరోగా జరిగే మార్కెటింగ్ మీద నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
ఇదే జరిగితే మిరాయ్ కు ఇతర రాష్ట్రాల్లో పోటీ పరంగా చిక్కులు తప్పవు. కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఎలాంటి కాంపిటేషన్ అయినా తట్టుకోవచ్చని హనుమాన్ గతంలో నిరూపించింది. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లను దాటుకుని తేజ సజ్జ గెలిచాడు. ప్రతిసారి అలాగే జరుగుతుందని కాదు కానీ నాన్ సంక్రాంతి సీజన్ లో ఎంతైనా పోటీ వల్ల రిస్క్ ఉంటుంది. మిరాయ్ లో ఉన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ఇచ్చేలా ఉంటాయని టీమ్ చెబుతోంది. రాజా సాబ్ కన్నా ముందు పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న సినిమా కావడంతో మిరాయ్ మీద బయ్యర్ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
This post was last modified on June 30, 2025 11:49 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…