హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న తేజ సజ్జ కొత్త ప్యాన్ ఇండియా మూవీ మిరాయ్ సెప్టెంబర్ 5 విడుదలని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఏప్రిల్ లో రావాలని అనుకున్నప్పటికీ షూటింగ్ లో జాప్యంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల నాలుగు నెలలు వాయిదా వేసుకుంది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలనిజం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. సోలో రిలీజ్ కోసం ట్రై చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మంచి డేట్ పట్టుకుంది కానీ మరో రెండు గండాలు పోటీ రూపంలో ముంచుకు రాబోతున్నాయి.
దుల్కర్ సల్మాన్ కాంతని సెప్టెంబర్ 5 విడుదల చేసేందుకు నిర్మాత రానా దగ్గుబాటి ప్లాన్ చేస్తున్నట్టు ఫ్రెష్ అప్డేట్. ఇది చాలా నెలలుగా నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పీరియాడిక్ సెటప్ లో డిఫరెంట్ థ్రిల్లర్ గా తీస్తున్నారట. ఇది కాకుండా శివ కార్తికేయన్ మదరాసి సైతం అదే డేట్ కు వస్తోంది. గతంలోనే అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద మంచి అంచనాలున్నాయి. సికందర్ డైరెక్టర్ ట్రాక్ రికార్డు కన్నా అమరన్ హీరోగా జరిగే మార్కెటింగ్ మీద నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
ఇదే జరిగితే మిరాయ్ కు ఇతర రాష్ట్రాల్లో పోటీ పరంగా చిక్కులు తప్పవు. కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఎలాంటి కాంపిటేషన్ అయినా తట్టుకోవచ్చని హనుమాన్ గతంలో నిరూపించింది. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లను దాటుకుని తేజ సజ్జ గెలిచాడు. ప్రతిసారి అలాగే జరుగుతుందని కాదు కానీ నాన్ సంక్రాంతి సీజన్ లో ఎంతైనా పోటీ వల్ల రిస్క్ ఉంటుంది. మిరాయ్ లో ఉన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ఇచ్చేలా ఉంటాయని టీమ్ చెబుతోంది. రాజా సాబ్ కన్నా ముందు పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న సినిమా కావడంతో మిరాయ్ మీద బయ్యర్ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
This post was last modified on June 30, 2025 11:49 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…