వివాదాలు విశేషాలు సమన స్థాయిలో మోసుకొచ్చే రియాలిటీ షో బిగ్ బాస్ 9కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి యాంకర్ మారతారని ఏవేవో ప్రచారాలు జరిగాయి కానీ స్టార్ మా ఛానల్ మళ్ళీ ఆ బాధ్యతను అక్కినేని నాగార్జునకే ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రోమో కూడా వదిలింది. అయితే బిగ్ బాస్ గత రెండు మూడు సీజన్లు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకునే క్రమంలో కొంత స్ట్రగుల్ అవుతున్నాయి. ఏదైనా వైవిధ్యంగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమయింది. అందుకే ఈసారి రూటు మార్చి సెలబ్రిటీలతో పాటు సామాన్యులను భాగం చేసే విధంగా కొత్త ప్లాన్ వేశారు.
కాకపోతే దానికో ప్రొసీజర్ ఉంటుంది. సంస్థ చెప్పిన వెబ్ సైట్ లో బిగ్ బాస్ 9లో ఎందుకు పాల్గొనాలో చెబుతూ ఒక వీడియో రూపొందించి దాన్ని స్టార్ మాకు పంపించాలి. వచ్చినవన్నీ పరిశీలించి బెస్ట్ అనిపించిన వాళ్ళను ఆడిషన్లకు పిలుస్తారు. అక్కడ పాసైతే నేరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. విధి విధానాలకు సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి ఎత్తుగడే. దీని వల్ల కామన్ ఆడియన్స్ తో కనెక్షన్ పెరుగుతుంది. ఎంతసేపూ సోషల్ మీడియా సెలబ్రిటీల మీదే ఆధారపడటం ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు. సీజన్ 8 రిజల్ట్ లో ఇది స్పష్టమయ్యింది.
కుబేర బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న నాగార్జునకు ఆగస్ట్ లో రిలీజయ్యే కూలీలో మరో ప్రత్యేక మైల్ స్టోన్ కానుంది. బిగ్ బాస్ 9 దసరా నుంచి ప్రారంభమయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. అంటే 2025లో నాగార్జున మొత్తం మూడుసార్లు అభిమానులను పలకరించినట్టు అవుతుంది. నా సామిరంగా తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న నాగ్ కు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తోంది. త్వరలో తన వందో సినిమాకు రెడీ అవుతున్న నాగార్జున దానికి సంబంధించిన వివరాలు చెప్పడం లేదు. ఇక బిగ్ బాస్ 9 ఈసారి వివాదాలు పెంచుతోందో లేక ఇంకేదైనా డిఫరెంట్ రూట్ లో వెళ్తుందేమో చూడాలి.
This post was last modified on June 29, 2025 7:30 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…