వివాదాలు విశేషాలు సమన స్థాయిలో మోసుకొచ్చే రియాలిటీ షో బిగ్ బాస్ 9కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి యాంకర్ మారతారని ఏవేవో ప్రచారాలు జరిగాయి కానీ స్టార్ మా ఛానల్ మళ్ళీ ఆ బాధ్యతను అక్కినేని నాగార్జునకే ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రోమో కూడా వదిలింది. అయితే బిగ్ బాస్ గత రెండు మూడు సీజన్లు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకునే క్రమంలో కొంత స్ట్రగుల్ అవుతున్నాయి. ఏదైనా వైవిధ్యంగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమయింది. అందుకే ఈసారి రూటు మార్చి సెలబ్రిటీలతో పాటు సామాన్యులను భాగం చేసే విధంగా కొత్త ప్లాన్ వేశారు.
కాకపోతే దానికో ప్రొసీజర్ ఉంటుంది. సంస్థ చెప్పిన వెబ్ సైట్ లో బిగ్ బాస్ 9లో ఎందుకు పాల్గొనాలో చెబుతూ ఒక వీడియో రూపొందించి దాన్ని స్టార్ మాకు పంపించాలి. వచ్చినవన్నీ పరిశీలించి బెస్ట్ అనిపించిన వాళ్ళను ఆడిషన్లకు పిలుస్తారు. అక్కడ పాసైతే నేరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. విధి విధానాలకు సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి ఎత్తుగడే. దీని వల్ల కామన్ ఆడియన్స్ తో కనెక్షన్ పెరుగుతుంది. ఎంతసేపూ సోషల్ మీడియా సెలబ్రిటీల మీదే ఆధారపడటం ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు. సీజన్ 8 రిజల్ట్ లో ఇది స్పష్టమయ్యింది.
కుబేర బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న నాగార్జునకు ఆగస్ట్ లో రిలీజయ్యే కూలీలో మరో ప్రత్యేక మైల్ స్టోన్ కానుంది. బిగ్ బాస్ 9 దసరా నుంచి ప్రారంభమయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. అంటే 2025లో నాగార్జున మొత్తం మూడుసార్లు అభిమానులను పలకరించినట్టు అవుతుంది. నా సామిరంగా తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న నాగ్ కు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తోంది. త్వరలో తన వందో సినిమాకు రెడీ అవుతున్న నాగార్జున దానికి సంబంధించిన వివరాలు చెప్పడం లేదు. ఇక బిగ్ బాస్ 9 ఈసారి వివాదాలు పెంచుతోందో లేక ఇంకేదైనా డిఫరెంట్ రూట్ లో వెళ్తుందేమో చూడాలి.
This post was last modified on June 29, 2025 7:30 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…