ఎక్కడో బ్రిటన్లో మొదలై.. ఇప్పుడు ఇండియాలో ఇంటింటికీ వచ్చేసిన టీవీ షో.. బిగ్ బాస్. ముందుగా హిందీ ప్రేక్షకులను అలరించిన ఈ టీవీ షో.. తర్వాత దక్షిణాది వారినీ అలరించడం మొదలుపెట్టింది. తెలుగులో ఈ షోకూ తిరుగులేని ఆదరణ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తొలి సీజన్ను హోస్ట్ చేస్తే.. రెండో సీజన్లో నాని ఆ పాత్రను పోషించాడు. తర్వాతి సీజన్ నుంచి అక్కినేని నాగార్జున ‘బిగ్ బాస్’ను నడిపిస్తున్నారు. కొన్ని సీజన్ల తర్వాత నాగ్ స్థానంలోకి మరొకరు వస్తారంటూ ప్రతిసారీ చర్చ జరుగుతోంది కానీ.. తీరా షో మొదలయ్యే సమయానికి నాగార్జునే హోస్ట్గా కనిపిస్తున్నారు.
గత సీజన్ ముంగిట ఈ ప్రచారం గట్టిగా జరిగినా మార్పేమీ లేదు. ఈసారి కూడా అలాంటి ప్రచారమే నడిచింది. నాగ్ స్థానంలోకి విజయ్ దేవరకొండ వస్తాడని.. నందమూరి బాలకృష్ణతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈసారి కూడా హోస్ట్ మారడం లేదు. ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ ప్రోమోను తాజాగా స్టార్ మా లాంచ్ చేసింది. అందులో నాగార్జునే మెరిశారు. అంతే కాక కొత్త సీజన్ సరికొత్తగా ఉండబోతోందని నాగ్ హింట్ ఇచ్చారు. ఈసారి షోలో సెలబ్రెటీలు ఉండరట. అందరూ సామాన్యులేనట.
‘బిగ్ బాస్’ను ఫాలో అయ్యే వాళ్లే ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది స్టార్ మా. ఇందుకోసం వెబ్ సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. రిజిస్టర్ అయిన వాళ్ల నుంచే కంటెస్టెంట్లను ఎంచుకోబోతున్నారు. ఐతే పూర్తిగా అందరూ కొత్త వాళ్లే ఉంటారని కూడా చెప్పలేం. ముందు ఈ బ్యాచ్ నుంచి కంటెస్టెంట్లను ఎంచుకుని.. తర్వాత కొందరు సెలబ్రెటీలను జోడించే అవకాశముంది. అలా లేకపోతే షో ఆకర్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. జులై నెలాఖర్లో లేదా ఆగస్టు ప్రథమార్ధంలో ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ మొదలవుతుందని భావిస్తున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…