పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన ‘కాంతార’ సినిమాతో పాపులారిటీ సంపాదించిన కన్నడ అమ్మాయి సప్తమి గౌడ. ఆ సినిమా తర్వాత ఆమెకు బహు భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. హిందీలో ‘వ్యాక్సిన్ వార్’తో పాటు మరో చిత్రంలోనూ ఆమె నటించింది.. ఇక తెలుగులో ‘తమ్ముడు’ లాంటి క్రేజీ ప్రాజెక్టులో ఆమె అవకాశం దక్కించుకుంది. నితిన్ హీరోగా ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ రూపొందించిన చిత్రమిది. ఇందులో ఆమెతో పాటు వర్ష బొల్లమ్మ నితిన్ సరసన కథానాయికలుగా నటించారు.
ఐతే సప్తమి ఇందులో లీడ్ హీరోయిన్లలో ఒకరైనప్పటికీ.. హీరో నితిన్తో కేవలం రెండు గంటలు మాత్రమే చిత్రీకరణలో పాల్గొందట. తనది సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రే అయినప్పటికీ.. నితిన్ కాంబినేషన్లో తనకు సన్నివేశాలే ఉన్నాయట. దీంతో కేవలం రెండు గంటలు మాత్రమే నితిన్తో చిత్రీకరణలో పాల్గొనే అవకాశం దక్కిందని ఆమె ‘తమ్ముడు’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సినిమాలో తన మీద ఎక్కువగా సోలో సీన్లే తీశారని.. హీరో కాంబినేషన్లో చాలా తక్కువ సమయం చిత్రీకరణ జరగడంతో నితిన్తో పెద్దగా మాట్లాడే అవకాశం కూడా తనకు రాలేదని సప్తమి చెప్పింది.
‘కాంతార’ సినిమాలో తన నటన నచ్చి ‘తమ్ముడు’ సినిమా కోసం ఎంచుకున్నప్పటికీ.. నేరుగా ఏమీ తనకు సినిమాలో అవకాశం ఇవ్వలేదని.. దర్శకుడు వేణు శ్రీరామ్ ఆడిషన్ చేసి, ఔట్ పుట్ చూశాకే ఓకే చేశారని సప్తమి వెల్లడించింది. తన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని.. కథ మలుపు తిరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని సప్తమి చెప్పింది. కొన్ని కారణాల వల్ల ‘తమ్ముడు’ చిత్రీకరణ ఆలస్యమై తన తెలుగు అరంగేట్రం ఆలస్యం అయిందని.. కానీ ఆలస్యం అయినా ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుందని, తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని సప్తమి ధీమా వ్యక్తం చేసింది. ‘తమ్ముడు’ వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…