కరోనా కాలంలో దక్షిణాదిన చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో విడుదలయ్యాయి. కానీ వాటిలో చాలా వరకు చిన్న సినిమాలే. ఈ మధ్య వి, నిశ్శబ్దం లాంటి కొంచెం పెద్ద స్థాయి సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటిని మినహాయిస్తే అన్ని చిన్న రేంజివే. ఐతే ఇప్పుడు సూర్య లాంటి సూపర్ స్టార్ నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఈ సినిమా ఇలా రిలీజ్ కాబోతున్నట్లు కొన్ని నెలల కిందట ప్రకటన వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు.
సూర్య లాంటి పెద్ద హీరో ఇంకొంత కాలం సినిమాను హోల్డ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసుకోలేడా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయమై తమిళనాడు ఎగ్జిబిటర్లు సూర్య మీద ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించారు. అయినా సరే.. సూర్య తగ్గలేదు. తన భార్య జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాల్’ రిలీజపుడే ‘ఆకాశం నీ హద్దురా’ డిజిటల్ రిలీజ్ గురించి సంకేతాలిచ్చిన సూర్య.. తర్వాత అన్నంత పనీ చేశాడు.
ఐతే ఇదేమీ తాను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం కాదని సూర్య తాజాగా వెల్లడించాడు. థియేటర్ల పున:ప్రారంభం కోసం ఎదురు చూడలేని విపత్కర పరిస్థితి తనకు తలెత్తినట్లు అతను తెలిపాడు. తన నిర్మాణంలో ఏడు సినిమాలు సెట్స్ మీద ఉన్న సమయంలో కరోనా వచ్చిందని.. దీంతో ఈ చిత్రాల్లో భాగమైన వ్యక్తలకు చెందిన వందల కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకం అయిందని అతను చెప్పాడు. ఒక దశలో తన దగ్గర నిధులు నిండుకుని వాళ్లకు జీతాలివ్వలేని పరిస్థితి తలెత్తిందని.. ఆ పరిస్థితుల్లో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను అమేజాన్ వాళ్లకు అమ్మేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో ఈ కుటుంబాలను ఆదుకోగలిగానని చెప్పాడు.
తన చిత్రాన్ని థియేటర్ల కోసమే సిద్ధం చేశామని, కానీ అనివార్య పరిస్థితుల్లో ఇలా రిలీజ్ చేయాల్సి వచ్చిందని, ఐతే ఈ మార్గంలో మరింత మందికి రీచ్ అవుతున్నందుకు సంతోషమే అని తెలిపాడు. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘ఆకాశం నీ హద్దురా’ రెండు రోజుల కింటే ప్రైమ్లో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…