ప్రకాష్ బెలవాడి.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన టాలెంటెడ్ యాక్టర్. థియేటర్ టీచర్ అయిన ప్రకాష్.. నటుడిగానూ సత్తా చాటారు. ‘సాహో’ సినిమాలో షిండే అనే కీలక పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. బేసిగ్గా కన్నడ నటుడే అయినా.. హిందీలో ఆయన అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి నటుడు తన సొంత ఫిలిం ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కన్నడ ఇండస్ట్రీ అనాగరికమని.. దేశంతో దానంత వెనుకబడ్డ ఫిలిం ఇండస్ట్రీ లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఒక ఇంటర్వ్యూలో.
తాను కన్నడలో ఓ పెద్ద బేనర్లో నటించిన సినిమా చిత్రీకరణ సందర్భంగా ఎదురైన చేదు అనుభవాన్ని ప్రకాష్ బెలవాడి గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం తాను అడిగిన పారితోషకంలో ఏమీ తగ్గించుకోలేదని.. ఐతే తన రెమ్యూనరేషన్లను నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేసి ఒక్కోెటిగా ఇచ్చిన నిర్మాణ సంస్థ.. చివరి భాగాన్ని మాత్రం ఇవ్వలేదని ఆయన చెప్పారు. పైగా చివరి రోజు చిత్రీకరణ సందర్భంగా తన కారవాన్లోకి వచ్చిన ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధులు.. టాయిలెట్లోకి వెళ్లి నీళ్లు మొత్తం ఖాళీ చేశారని.. పైగా నీళ్లను కారవాన్లో పారబోశారని.. తద్వారా తాను కారవాన్ను ఉపయోగించకుండా బయట ఎండలో ఉండేలా చేశారని ఆయన ఆరోపించారు.
ఈ నిర్మాణ సంస్థ పేరు తాను చెప్పలేనని.. ఎందుకంటే వాళ్లంటే తనకు భయమని ప్రకాష్ బెలవాడి తెలిపారు. మళ్లీ ఆ బేనర్లో సినిమా చేయమంటే, రోజుకు పది లక్షలు ఇస్తానన్నా తాను నటించనని ప్రకాష్ తెలిపాడు. ఈ బేనర్ అనే కాదని.. మొత్తంగా కన్నడ ఇండస్ట్రీలో పరిస్థితి బాగా లేదని.. వాళ్లకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లను గౌరవించడం తెలియదని ప్రకాష్ బెలవాడి తెలిపారు. కన్నడలో అసలు కాంట్రాక్ట్ అన్నది ఉండదని.. దేశంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కాంట్రాక్ట్ చేసుకోని ఏకైక ఫిలిం ఇండస్ట్రీ అదొక్కటే అని ఆయన అన్నారు. బయటి భాషా చిత్రాల్లో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. తనను అందరూ బాగా చూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on June 27, 2025 6:46 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…