ప్రకాష్ బెలవాడి.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన టాలెంటెడ్ యాక్టర్. థియేటర్ టీచర్ అయిన ప్రకాష్.. నటుడిగానూ సత్తా చాటారు. ‘సాహో’ సినిమాలో షిండే అనే కీలక పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. బేసిగ్గా కన్నడ నటుడే అయినా.. హిందీలో ఆయన అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి నటుడు తన సొంత ఫిలిం ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కన్నడ ఇండస్ట్రీ అనాగరికమని.. దేశంతో దానంత వెనుకబడ్డ ఫిలిం ఇండస్ట్రీ లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఒక ఇంటర్వ్యూలో.
తాను కన్నడలో ఓ పెద్ద బేనర్లో నటించిన సినిమా చిత్రీకరణ సందర్భంగా ఎదురైన చేదు అనుభవాన్ని ప్రకాష్ బెలవాడి గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం తాను అడిగిన పారితోషకంలో ఏమీ తగ్గించుకోలేదని.. ఐతే తన రెమ్యూనరేషన్లను నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేసి ఒక్కోెటిగా ఇచ్చిన నిర్మాణ సంస్థ.. చివరి భాగాన్ని మాత్రం ఇవ్వలేదని ఆయన చెప్పారు. పైగా చివరి రోజు చిత్రీకరణ సందర్భంగా తన కారవాన్లోకి వచ్చిన ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధులు.. టాయిలెట్లోకి వెళ్లి నీళ్లు మొత్తం ఖాళీ చేశారని.. పైగా నీళ్లను కారవాన్లో పారబోశారని.. తద్వారా తాను కారవాన్ను ఉపయోగించకుండా బయట ఎండలో ఉండేలా చేశారని ఆయన ఆరోపించారు.
ఈ నిర్మాణ సంస్థ పేరు తాను చెప్పలేనని.. ఎందుకంటే వాళ్లంటే తనకు భయమని ప్రకాష్ బెలవాడి తెలిపారు. మళ్లీ ఆ బేనర్లో సినిమా చేయమంటే, రోజుకు పది లక్షలు ఇస్తానన్నా తాను నటించనని ప్రకాష్ తెలిపాడు. ఈ బేనర్ అనే కాదని.. మొత్తంగా కన్నడ ఇండస్ట్రీలో పరిస్థితి బాగా లేదని.. వాళ్లకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లను గౌరవించడం తెలియదని ప్రకాష్ బెలవాడి తెలిపారు. కన్నడలో అసలు కాంట్రాక్ట్ అన్నది ఉండదని.. దేశంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కాంట్రాక్ట్ చేసుకోని ఏకైక ఫిలిం ఇండస్ట్రీ అదొక్కటే అని ఆయన అన్నారు. బయటి భాషా చిత్రాల్లో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. తనను అందరూ బాగా చూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…