ప్రకాష్ బెలవాడి.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన టాలెంటెడ్ యాక్టర్. థియేటర్ టీచర్ అయిన ప్రకాష్.. నటుడిగానూ సత్తా చాటారు. ‘సాహో’ సినిమాలో షిండే అనే కీలక పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. బేసిగ్గా కన్నడ నటుడే అయినా.. హిందీలో ఆయన అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి నటుడు తన సొంత ఫిలిం ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కన్నడ ఇండస్ట్రీ అనాగరికమని.. దేశంతో దానంత వెనుకబడ్డ ఫిలిం ఇండస్ట్రీ లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఒక ఇంటర్వ్యూలో.
తాను కన్నడలో ఓ పెద్ద బేనర్లో నటించిన సినిమా చిత్రీకరణ సందర్భంగా ఎదురైన చేదు అనుభవాన్ని ప్రకాష్ బెలవాడి గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం తాను అడిగిన పారితోషకంలో ఏమీ తగ్గించుకోలేదని.. ఐతే తన రెమ్యూనరేషన్లను నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేసి ఒక్కోెటిగా ఇచ్చిన నిర్మాణ సంస్థ.. చివరి భాగాన్ని మాత్రం ఇవ్వలేదని ఆయన చెప్పారు. పైగా చివరి రోజు చిత్రీకరణ సందర్భంగా తన కారవాన్లోకి వచ్చిన ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధులు.. టాయిలెట్లోకి వెళ్లి నీళ్లు మొత్తం ఖాళీ చేశారని.. పైగా నీళ్లను కారవాన్లో పారబోశారని.. తద్వారా తాను కారవాన్ను ఉపయోగించకుండా బయట ఎండలో ఉండేలా చేశారని ఆయన ఆరోపించారు.
ఈ నిర్మాణ సంస్థ పేరు తాను చెప్పలేనని.. ఎందుకంటే వాళ్లంటే తనకు భయమని ప్రకాష్ బెలవాడి తెలిపారు. మళ్లీ ఆ బేనర్లో సినిమా చేయమంటే, రోజుకు పది లక్షలు ఇస్తానన్నా తాను నటించనని ప్రకాష్ తెలిపాడు. ఈ బేనర్ అనే కాదని.. మొత్తంగా కన్నడ ఇండస్ట్రీలో పరిస్థితి బాగా లేదని.. వాళ్లకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లను గౌరవించడం తెలియదని ప్రకాష్ బెలవాడి తెలిపారు. కన్నడలో అసలు కాంట్రాక్ట్ అన్నది ఉండదని.. దేశంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కాంట్రాక్ట్ చేసుకోని ఏకైక ఫిలిం ఇండస్ట్రీ అదొక్కటే అని ఆయన అన్నారు. బయటి భాషా చిత్రాల్లో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. తనను అందరూ బాగా చూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…