ప్రకాష్ బెలవాడి.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన టాలెంటెడ్ యాక్టర్. థియేటర్ టీచర్ అయిన ప్రకాష్.. నటుడిగానూ సత్తా చాటారు. ‘సాహో’ సినిమాలో షిండే అనే కీలక పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. బేసిగ్గా కన్నడ నటుడే అయినా.. హిందీలో ఆయన అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి నటుడు తన సొంత ఫిలిం ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కన్నడ ఇండస్ట్రీ అనాగరికమని.. దేశంతో దానంత వెనుకబడ్డ ఫిలిం ఇండస్ట్రీ లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఒక ఇంటర్వ్యూలో.
తాను కన్నడలో ఓ పెద్ద బేనర్లో నటించిన సినిమా చిత్రీకరణ సందర్భంగా ఎదురైన చేదు అనుభవాన్ని ప్రకాష్ బెలవాడి గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం తాను అడిగిన పారితోషకంలో ఏమీ తగ్గించుకోలేదని.. ఐతే తన రెమ్యూనరేషన్లను నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేసి ఒక్కోెటిగా ఇచ్చిన నిర్మాణ సంస్థ.. చివరి భాగాన్ని మాత్రం ఇవ్వలేదని ఆయన చెప్పారు. పైగా చివరి రోజు చిత్రీకరణ సందర్భంగా తన కారవాన్లోకి వచ్చిన ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధులు.. టాయిలెట్లోకి వెళ్లి నీళ్లు మొత్తం ఖాళీ చేశారని.. పైగా నీళ్లను కారవాన్లో పారబోశారని.. తద్వారా తాను కారవాన్ను ఉపయోగించకుండా బయట ఎండలో ఉండేలా చేశారని ఆయన ఆరోపించారు.
ఈ నిర్మాణ సంస్థ పేరు తాను చెప్పలేనని.. ఎందుకంటే వాళ్లంటే తనకు భయమని ప్రకాష్ బెలవాడి తెలిపారు. మళ్లీ ఆ బేనర్లో సినిమా చేయమంటే, రోజుకు పది లక్షలు ఇస్తానన్నా తాను నటించనని ప్రకాష్ తెలిపాడు. ఈ బేనర్ అనే కాదని.. మొత్తంగా కన్నడ ఇండస్ట్రీలో పరిస్థితి బాగా లేదని.. వాళ్లకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లను గౌరవించడం తెలియదని ప్రకాష్ బెలవాడి తెలిపారు. కన్నడలో అసలు కాంట్రాక్ట్ అన్నది ఉండదని.. దేశంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కాంట్రాక్ట్ చేసుకోని ఏకైక ఫిలిం ఇండస్ట్రీ అదొక్కటే అని ఆయన అన్నారు. బయటి భాషా చిత్రాల్లో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. తనను అందరూ బాగా చూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on June 27, 2025 6:46 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…