Movie News

రివ్యూలను ఆపడంపై కోర్టు సంచలన తీర్పు

సినిమా ఇలా రిలీజవ్వగానే.. అలా ప్రత్యక్షమయ్యే ఆన్ లైన్ రివ్యూలపై ఇండస్ట్రీ నుంచి తరచుగా వ్యతిరేక స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. రివ్యూల వల్ల సినిమాలు చచ్చిపోతున్నాయని.. ఆన్ లైన్ రివ్యూలను నిషేధించాలని.. రిలీజైన కొన్ని రోజుల పాటు అవి బయటికి రాకుండా ఆపాలని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడుతుంటారు. ఐతే తమిళ సినీ పరిశ్రమలో ఇలా కేవలం డిమాండ్లు చేయడం కాకుండా కార్యాచరణకూ సిద్ధమైపోయారు. ఆన్ లైన్ రివ్యూలు మూడు రోజుల పాటు బయటికి రాకుండా ఆపాలంటూ తమిళ నిర్మాతల సంఘం మద్రాస్ హైకోర్టులో ఇటీవలే పిటిషన్ వేసింది.

ఈ కేసు తాజాగా విచారణకు రాగా.. జస్టిస్ ఆనంద్ వెంకటేశన్ ఆ పిటిషన్‌ను కొట్టివేయడం గమనార్హం. రివ్యూలను నిషేధించడం, మూడు రోజుల పాటు అవి బయటికి రాకుండా చేయడం అంటే.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రివ్యూలు పోస్ట్ చేయకుండా ఆపడం అసాధ్యమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

నిర్మాతలు ఎప్పుడూ పాజిటివ్ రివ్యూలే ఆశించలేరని.. ఏ రంగానికి చెందిన వారైనా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌కు గురవుతున్న విషయాన్ని మరవకూడదని కోర్టు పేర్కొంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువ’ సినిమాకు సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు రావడం.. సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడడంతో కోలీవుడ్లో రివ్యూల మీద యుద్ధం మొదలైంది. ఆ సమయంలోనే మూడు రోజుల పాటు రివ్యూలను ఆపడం మీద కోలీవుడ్ నిర్మాతల్లో ఆలోచన మొదలైంది. ఈ మేరకు కోర్టుకు వెళ్లారు. కానీ కోర్టులో ఇప్పుడు వారికి చుక్కెదురైంది.

This post was last modified on June 27, 2025 12:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కొండా కోన‌ల్లో.. లోయ‌ల్లో.. పోలింగ్ కేంద్రాలు ఇవే!

సాధార‌ణంగా జ‌నావాసాలు ఉండే న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌డం తెలిసిందే. ఆయా కేంద్రాల‌కు ఎన్నిక‌ల సిబ్బంది…

54 minutes ago

పెద్ది దర్శకుడి వెనుక ‘తొలిప్రేమ’ కథ

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…

5 hours ago

సమంత బంగారానికి సూర్య సవాల్

తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…

5 hours ago

పుట్టా మహేష్ వివాదంపై స్పందించిన బాబు

ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…

9 hours ago

బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?

ఇంట్లో బైక్‌ను స్టార్ట్‌లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…

10 hours ago

కొత్త రిస్కుకు రెడీ అవుతున్న మెగా హీరో

క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…

10 hours ago