సినిమా ఇలా రిలీజవ్వగానే.. అలా ప్రత్యక్షమయ్యే ఆన్ లైన్ రివ్యూలపై ఇండస్ట్రీ నుంచి తరచుగా వ్యతిరేక స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. రివ్యూల వల్ల సినిమాలు చచ్చిపోతున్నాయని.. ఆన్ లైన్ రివ్యూలను నిషేధించాలని.. రిలీజైన కొన్ని రోజుల పాటు అవి బయటికి రాకుండా ఆపాలని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడుతుంటారు. ఐతే తమిళ సినీ పరిశ్రమలో ఇలా కేవలం డిమాండ్లు చేయడం కాకుండా కార్యాచరణకూ సిద్ధమైపోయారు. ఆన్ లైన్ రివ్యూలు మూడు రోజుల పాటు బయటికి రాకుండా ఆపాలంటూ తమిళ నిర్మాతల సంఘం మద్రాస్ హైకోర్టులో ఇటీవలే పిటిషన్ వేసింది.
ఈ కేసు తాజాగా విచారణకు రాగా.. జస్టిస్ ఆనంద్ వెంకటేశన్ ఆ పిటిషన్ను కొట్టివేయడం గమనార్హం. రివ్యూలను నిషేధించడం, మూడు రోజుల పాటు అవి బయటికి రాకుండా చేయడం అంటే.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రివ్యూలు పోస్ట్ చేయకుండా ఆపడం అసాధ్యమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
నిర్మాతలు ఎప్పుడూ పాజిటివ్ రివ్యూలే ఆశించలేరని.. ఏ రంగానికి చెందిన వారైనా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్కు గురవుతున్న విషయాన్ని మరవకూడదని కోర్టు పేర్కొంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువ’ సినిమాకు సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు రావడం.. సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడడంతో కోలీవుడ్లో రివ్యూల మీద యుద్ధం మొదలైంది. ఆ సమయంలోనే మూడు రోజుల పాటు రివ్యూలను ఆపడం మీద కోలీవుడ్ నిర్మాతల్లో ఆలోచన మొదలైంది. ఈ మేరకు కోర్టుకు వెళ్లారు. కానీ కోర్టులో ఇప్పుడు వారికి చుక్కెదురైంది.
This post was last modified on June 27, 2025 12:15 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…