Movie News

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3? : స్పందించిన దిల్ రాజు!

టాలీవుడ్లో ఎంతోమంది హీరోలకు ఘనవిజయాలు అందించారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఇమేజ్ లేని హీరోలను స్టార్లను చేసిన.. స్టార్లను సూపర్ స్టార్లను చేసిన ఘనత ఆయన సొంతం. అలాంటి ఆయన తన కుటుంబానికి చెందిన ఆశిష్‌ను హీరోగా నిలబెట్టలేకపోతున్నారు. తన సోదరుడు శిరీష్ తనయుడైన ఆశిష్‌ను హీరోగా పెట్టి రెండు చిత్రాలు (రౌడీ బాయ్స్, లవ్ మి) నిర్మించిన రాజుకు విజయం దక్కలేదు. ఆశిష్ కొత్త ప్రాజెక్టులపై ప్రస్తుతం సరైన సమాచారం లేదు. అతను హీరోగా రెండేళ్ల ముందే ‘సెల్ఫిష్’ అనే సినిమా మొదలైంది కానీ.. అది ఎంతకీ పూర్తి కాలేదు. రిలీజ్‌కూ నోచుకోలేదు. మరోవైపు ఆశిష్ హీరోగా ‘ఆర్య-3’ చేస్తారనే ప్రచారం ఇటీవల నడిచింది. ఇంకోవైపు ‘దేత్తడి’ అంటూ మరో సినిమా తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టుల గురించి దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

‘సెల్ఫిష్’ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. అది సుకుమార్, తాను కలిసి ఒక ఐడియా నచ్చి మొదలుపెట్టిన సినిమా అని రాజు చెప్పారు. సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో సినిమా మొదలైందని.. 50 శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేశామని రాజు తెలిపారు. కానీ సగం సినిమా అయ్యాక చూసుకుంటే ఔట్ పుట్ సరిగా లేదని.. దీంతో దాన్ని హోల్డ్‌లో పెట్టామని రాజు వెల్లడించారు. అన్నీ సరి చూసుకుని 100 పర్సంట్ సంతృప్తికరంగా అనిపిస్తేనే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నామని.. ప్రస్తుతానికి అది హోల్డ్‌లోనే ఉందని ఆయన చెప్పారు. ‘రౌడీ బాయ్స్’‌కు కరోనా వల్ల కొంత ఇబ్బంది తలెత్తిందని.. రిలీజ్ టైమింగ్ సరిగా కుదరలేదని రాజు చెప్పారు. ‘లవ్ మి’ ఆశిష్‌కు డిఫరెంట్‌గా ఉంటుందని ట్రై చేశామని.. కానీ అది పూర్తిగా మిస్ ఫైర్ అయిందని రాజు తెలిపారు.

ఇక ‘ఆర్య-3’ గురించి మాట్లాడుతూ.. తాను, సుకుమార్ కలిసి ఒక ఐడియా విషయంలో ఎగ్జైట్ అయి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించామని.. ఐతే పూర్తి కథేమీ రెడీ కాలేదని రాజు తెలిపారు. ‘ఆర్య’కు సుకుమార్ పని చేసినట్లే పిచ్చెక్కినట్లు పని చేసే దర్శకుడి కోసం చూస్తున్నామని.. స్క్రిప్టు ఎలాంటి షేప్ తీసుకుంటుందన్న దాన్ని బట్టి దాన్ని అల్లు అర్జున్‌తో చేయాలా.. ఆశిష్‌తో చేయాలా.. మరొకరిని ఎంచుకోవాలా అన్నది నిర్ణయిస్తామని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆశిష్ హీరోగా ‘దేత్తడి’తో పాటు మరో కథ కూడా ఓకే అయిందని.. ప్రస్తుతం వీటి స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ‘దేత్తడి’ తమ బేనర్లోనే చేస్తామని.. ఇంకోటి బయటి బేనర్లో ఉంటుందని రాజు వెల్లడించారు.

Kumar

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

33 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

2 hours ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

2 hours ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

4 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

4 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago