మహాభారతం మీద సినిమా అనగానే చాలా ఏళ్ల నుంచి అందరికీ రాజమౌళే గుర్తుకు వస్తున్నారు. ‘బాహుబలి’ మొదలుపెడుతున్న సమయంలో మహాభారతం మీద సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని, దాని కోసం అనుభవం గడించే పనిలో ఉన్నానని.. ఆ సినిమా మొదలుపెట్టడానికి ఓ పదేళ్లు పట్టొచ్చని ప్రకటించి సర్వత్రా ఆసక్తి రేకెత్తించాడు జక్కన్న. బాహుబలి, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలు చూశాక.. మహాభారతాన్ని రాజమౌళి ఎలా తీస్తాడు అనే ఊహే ప్రేక్షకులను నిలవనీయడం లేదు. కానీ తాను చెప్పిన పదేళ్ల సమయం పూర్తయినా జక్కన్న ‘మహాభారతం’ను మొదలుపెట్టలేదు.
మహేష్ సినిమా అయ్యాక అయినా ఈ దిశగా అడుగులు పడతాయేమో చూడాలి. రాజమౌళి ఆలస్యం చేసేసరికి ఆమిర్ ఖాన్ లైన్లోకి వచ్చేశాడు. తన టీంతో కలిసి భారీ స్థాయిలో ‘మహాభారతం’ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. రాజమౌళి చేయబోతుండగా.. ఆమిర్ ఈ ప్రయత్నం చేయడం అవసరమా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇంతలో ఇప్పుడు మహాభారతాన్ని భారీ స్థాయిలో సినిమాగా తీయడానికి మరో దర్శకుడు రెడీ అవుతున్నాడు. ఆయనే.. ముకేశ్ కుమార్ సింగ్. హిందీలో ‘మహాభారతం’ సీరియల్ను భారీ స్థాయిలో తీసి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ముకేశ్.
సీరియల్ అయినా సరే ‘మహాభారతం’ మీద రూ.200 కోట్లు పెట్టారంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఏ సీరియల్ దర్శకుడికీ రాని పేరు ముకేశ్కు వచ్చింది. అందులో పనితనం చూసే ‘కన్నప్ప’ సినిమాకు ఆయన్ని దర్శకుడిగా ఎంచుకున్నారు మంచు విష్ణు-మోహన్ బాబు. ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ముకేశ్.. ‘మహాభారతం’ను సినిమాగా కూడా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఆల్రెడీ ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని.. ‘కన్నప్ప’ రిలీజ్ తర్వాత పూర్తి వివరాలు ప్రకటిస్తానని ముకేశ్ తెలిపారు. ముందేమో ఆమిర్, ఇప్పుడేమో ముకేశ్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ‘మహాభారతం’ ప్రాజెక్టులను అనౌన్స్ చేసేస్తున్నారు. మరి మన జక్కన్న ఎప్పుడు ఈ సినిమాను మొదలుపెడతాడో?
This post was last modified on June 25, 2025 11:13 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…